శృతిహాసన్ క్యూట్ క్యూట్ డైలాగ్స్ తో  మెస్మరైజ్ చేసే  తన అందాలతో ప్రేక్షకుల మతి పోగొడుతుంది . ఇప్పటికే అందరు టాప్ హీరోల సరసన మెరిసింది శృతిహాసన్. అయితే పవన్ కళ్యాణ్ తో చేసిన కాటమరాయుడు సినిమా తర్వాత శృతిహాసన్ సినిమాలకు కాస్త దూరం అయింది. సినిమాల్లోకి రాక ముందు నుంచి ఓ మంచి సింగర్ సంగీత దర్శకురాలిగా పేరు తెచ్చుకుంది శృతిహాసన్. అప్పట్లో కమలహాసన్ వెంకటేష్ హీరోగా నటించిన ఈనాడు  సినిమాకి సంగీత దర్శకురాలిగా కూడా వ్యవహరించింది . అంతే కాకుండా తెలుగులో కొన్ని సినిమాల్లో  పాటలు కూడా పాడింది శృతిహాసన్. సినిమాలకు దూరంగా ఉన్న ఈ అందాల భామ లైవ్ మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తుంది . అయితే అది కాస్త వర్క్ అవుట్ అవ్వకపోవటం తో   మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టినట్లు  వార్తలు కూడా వస్తున్నాయి. 

 

 

 

 

 

సిమిమాలకి  దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులను ఇప్పుడు అలరిస్తూనే ఉంటుంది శృతిహాసన్. అయితే తాజాగా తనకు విస్కీ  అంటే చాలా ఇష్టం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మంచు లక్ష్మీ హోస్ట్  వ్యవహరిస్తున్న  పీట్ అప్ విత్ స్టార్స్  అనే తెలుగు రియాల్టీ షోలో శృతి హాసన్ పాల్గొంది. అయితే సెలెబ్రిటీల పర్సనల్ లైఫ్ కి సంబంధించిన చాలా ఆసక్తికర విషయాలు షో ద్వారా బయటకు వస్తున్నా సంగతి తెలిసిందే . ఈ షోలో పాల్గొన్న శృతిహాసన్ తన పర్సనల్ లైఫ్ కు సంబంధించి కొన్ని ఆశక్తికర విషయాలను తెలియజేసింది. 

 

 

 

 

 

 అయితే ఫీట్ అప్ విత్ స్టార్స్  అనే ప్రోగ్రాం కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న మంచు లక్ష్మి నువ్వు విస్కీ  తాగుతావా అంటూ శ్రుతి హాసన్ ను  అడిగిన ప్రశ్నకు సమాధానంగా శృతిహాసన్ షాకింగ్ కామెంట్ చేసింది. అవును తాగుతాను నాకు విస్కీ అంటే చాలా ఇష్టం అని సమాధానమిచ్చింది శృతిహాసన్.కానీ  ఒకప్పుడు తాగుతుండేదాన్నాన్ని  ప్రస్తుతం కొన్ని ఆరోగ్య పరిస్థితులు మరియు ఇంకా కొన్ని కారణాలవల్ల విస్కీ తాగటం మానేసానని... ఇంకెప్పుడు తాగొద్దని  నిర్ణయం తీసుకుని తాగడం మానేశానని శృతిహాసన్ తెలిపింది. అంతేకాకుండా తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన మరికొన్ని విశేషాలను ఈ షోలో పంచుకుంది శృతిహాసన్.కాగా  ప్రస్తుతం ఈ భామ బ్రాండింగ్ తో బిజీ బిజీగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: