వైసీపీ అధికారంలోకి రావడంతో సాక్షి పత్రికతో అనుబంధం ఉన్న వారందరికీ ఉన్నత గౌరవం దక్కుతోంది. ఇప్పటికే సజ్జల రామక్రిష్ణారెడ్డి, దేవులపల్లి అమర్, కె రామచంద్రమూర్తి, జీవీడీ క్రిష్ణమోహన్ వంటి వారు అనేకమైన కీలక పదవుల్లో నియమితులయ్యారు. ఇపుడు అదే వరసలో మల్టీ టాలెంటెడ్ గా పేరు తెచ్చుకున్న యాంకర్ స్వప్నకు ఎస్వీబీసీ చానల్ డైరెక్టర్ గా పదవి ఖరారు అయిందని న్యూస్ వచ్చింది.


స్వప్న టీవీ 9 ద్వారా సుమార్ 15 ఏళ్ళ క్రితం జర్నలిస్ట్ గా మీడియా ఫీల్డ్ కి వచ్చారు. ఆ తరువాత ఆమె సాక్షిలో  కూడా యాంకర్ గా, న్యూస్ రీడర్ గా కీలకమైన బాధ్యతలు నిర్వహించారు. ఇక స్వప్న మల్టీ టాలెంటెడ్, ఆమె సంగీతంలో కూడా మంచి ప్రావీణ్యం కనబరుస్తారు. పైగా సాక్షి చానల్లో ఆమె అనేక హోదాల్లో సేవలు అందించి ఆ చానల్ హైప్ పెంచారు. ఇపుడు స్వప్న సేవలకు గుర్తింపుగా వైసీపీ సర్కార్ ఆమెను ఉన్న‌తమైన పదవిలో నియమిస్తోదంటున్నారు. ఈ మేరకు రెండు రోజుల్లో ఉత్తర్వులు వస్తాయని, ఓ మంచి ముహూర్తం చూసుకుని స్వప్న బాధ్యతలు స్వీకరిస్తారని అంటున్నారు.


అన్ని అర్హతలు ఉన్న స్వప్నకు ఈ పదవి దక్కడం మంచి పరిణామమేనని అంతా అంటున్నారు. ఇదిలా ఉండగా ఎస్వీబీసీ చానల్ కి ఇప్పటికే సినీ నటుడు ప్రుద్వీ రాజ్ చైర్మన్ గా ఉన్నారు. ఇపుడు స్వప్న డైరెక్టర్ అవుతున్నారు. దాంతో చానల్ ప్రసారాల్లో నాణ్యత, కార్యక్రమాల్లో కొత్తదనం ఉంటుందని ఆశిస్తున్నారు. స్వామి వారి గురించి మరింతంగా జనంలోకి ఆధ్యత్మికత వెళ్ళేలా క్రుషి జరగాలని కూడా అంతా కోరుకుంటున్నారు.  ఇక కమర్షియల్ గా కాకుండా పూర్తిగా భక్తిభావం నిండేలా కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని కూడా కోరుకుంటున్నారు భక్తజనులు.



మరింత సమాచారం తెలుసుకోండి: