తెలుగు తెర మీద కామెడీ పంచే కమెడియన్లు చాలా మంది ఉన్నారు. అసలు తెలుగులో ఉన్న కమెడియన్లు మరే ఇండస్ట్రీలో లేరు. అయితే ప్రస్తుతం తెలుగులో టాప్ కమెడియన్ ఎవరని అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు వెన్నెల కిషోర్. వెన్నెల సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి ఆ పేరును ఇంటి పేరుగా మార్చుకున్నాడు. విడుదల అవుతున్న ప్రతి సినిమాలోనూ వెన్నెల కిషోర్ కనిపించి తనదైన పంచులతో అందర్నీ నవ్విస్తున్నాడు.
అయితే సినిమాల్లోనే సోషల్ మీడియాలో కూడా ఆక్టివ్ గా ఉండే వెన్నెల కిషోర్...తాజాగా ఒక పంచు వేసి నెటిజన్లను నవ్వించాడు.  వెన్నెల కిషోర్ కి బాగా క్లోజ్ అయిన బ్రహ్మాజీ మీద ఆ పంచ్ పడింది. బ్రహ్మాజీ కూడా సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటాడు. బ్రహ్మాజీ ప్రస్తుతం "సరిలేరు నీకెవ్వరు" సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్ లో దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ, ఇద్దరం క్లాస్ మేట్స్..మళ్ళీ ఇప్పుడు ఇలా కలిశాం అంటూ కామెంట్ పెట్టాడు.

దీంతో అనిల్ రావిపూడి ఉడుక్కుని, ఒకే రకం గ్లాసెస్ పెట్టినంత మాత్రాన ఒకే క్లాస్ అంటావా...నేను నా చిన్నప్పటి నుండి మీ సినిమాలు చూస్తూ పెరిగాను. ఇప్పుడు మీతో సినిమా చేస్తున్నాను అంటూ పంచ్ వేశాడు. వీరిద్దరి మధ్యలోకి ఎంట్రీ ఇచ్చిన వెన్నెల కిషోర్ తనదైన శైలిలో పంచ్ వేశాడు. అనిల్ చెప్పింది నిజమే... నేనే కాదు మా నాన్న గారు కూడా  బ్రహ్మాజీ గారి సినిమాలు చూస్తూ పెరిగారు అన్నాడు. వీరి ముగ్గురి సంభాషణతో నెటిజన్లకి ఫుల్ కామెడీ పంచారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న "సరిలేరు నీకెవ్వరు" సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదిన విడుదల అవుతుందని ప్రకటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: