కోలీవుడ్ స్టార్ హీరో , ఇళయ దళపతి విజయ్  తన రెమ్యూనరేషన్  ను భారీగా పెంచినట్లు  వార్తలు వస్తున్నాయి. విజయ్ కి తమిళనాడులో  భారీ మార్కెట్  వుంది. ప్రస్తుతం రజినీకాంత్ ను కూడా దాటి విజయ్ అక్కడ నంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు.  అలాగే విజయ్ నటించిన  సినిమాలు తమిళంతో పాటు కేరళ , తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లను రాబడుతున్నాయి.  విజయ్ నటించిన సినిమాల హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా భారీగా డిమాండ్ వుంది. వీటన్నంటినికి దృషి లో పెట్టుకొని  విజయ్ తన లేటెస్ట్ మూవీ బిగిల్ కు ఏకంగా 3540కోట్ల  రెమ్యూనరేషన్  ఛార్జ్ చేశాడట.  తద్వారా సౌత్ లో రజినీ,ప్రభాస్ తరువాత అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోగా  రికార్డు సృష్టించాడు  విజయ్.  ఈముగ్గురు  200 కోట్ల క్లబ్ లో చేరినవాళ్ళే. తాజాగా ఈజాబితాలో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరిపోయాడు. ఆయన నటించిన సైరా  200కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. 



ఇక విజయ్, బిగిల్ ముందు వరుకు  20-25కోట్ల పారితోషికాన్ని తీసుకున్నాడు.  ఇదిలా ఉంటే తాజాగా విడుదలైన ఈ చిత్రం యొక్క ట్రైలర్  యూ ట్యూబ్ ను షేక్ చేస్తుంది.  స్పోర్ట్స్ డ్రామా గా రానున్న ఈ చిత్రంపై సౌత్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అట్లీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో  నయనతార  కథానాయికగా నటించగా  ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.  దీపావళికి కానుకగా ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదలకానుంది.  ఈచిత్రం  తెలుగులో విజిల్ అనే టైటిల్ తో  విడుదలకానుంది. దీపావళికి  తెలుగు నుండి పెద్ద సినిమాల విడుదలకాకపోవడంతో  విజయ్  తన మార్కెట్ ను   విస్తరించుకునేందుకు ఇదేచక్కటి అవకాశం. మరి ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: