టాలీవుడ్ క్రేజీ డైరక్టర్స్ లో ఒకరైన సుకుమార్ రంగస్థలంతో తన రేంజ్ మరింత పెంచుకున్నాడని చెప్పొచ్చు. అప్పటివరకు స్టైలిష్ సినిమాలే తీసే సుకుమార్ రంగస్థలం లాంటి మూవీ కూడా తీయగలడని ప్రూవ్ చేసుకున్నాడు. రంగస్థలం తర్వాత మహేష్ తో మూవీ చేయాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యింది.


ప్రస్తుతం అల్లు అర్జున్ తో సినిమా ప్లానింగ్ లో ఉన్న సుక్కు ఆ సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత సుకుమార్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తాడని తెలుస్తుంది. రంగస్థలం తర్వాత మెగా కాంపౌండ్ కు దగ్గరా ఉంటున్న సుకుమార్ చిరుతో సినిమా చేయాలన్న కోరిక బయట పెట్టాడట.


ఈమధ్యనే ఓ లైన్ కూడా అనుకున్నాడట. సైరా హిట్ అవడంతో మంచి జోష్ లో ఉన్న చిరంజీవి వరుసగా సినిమాలు చేయాలని చూస్తున్నాడు. రీసెంట్ గా కొరటాల శివ సినిమా ముహుర్త కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఇక ఈ సినిమా తర్వాత చిరు సుకుమార్ మూవీ ఉంటుందని తెలుస్తుంది.  


బన్ని సినిమా హిట్ అయితే కనుక చిరు సినిమా కన్ఫాంగా ఉంటుంది. అల్లు అర్జున్ సినిమా కథ విషయంలోనే ఇంకా డిస్కషన్స్ ఫైనల్ అవలేదని తెలుస్తుంది. అయితే సుకుమార్ చిరుతో తీసే సినిమా మళయాళ మూవీ లూసిఫర్ రీమేక్ అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. మరి ఈ కాంబో మూవీపై క్లారిటీ రావాలంటే అఫిషియల్ గా ఎనౌన్స్ చేస్తే కాని నమ్మలేం. ఒకవేళ సుకుమార్ తో మెగా మూవీ ఫిక్స్ అయితే కనుక 2020 సెకండ్ హాఫ్ లో ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. మెగాస్టార్ తో సుకుమార్ కచ్చితంగా మెగా ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ అన్నట్టే లెక్క.   


మరింత సమాచారం తెలుసుకోండి: