మెగాస్టార్ చిరంజీవి ఇటీవల నటించిన స్వాతంత్రోద్యమ బ్యాక్ డ్రాప్ మూవీ సైరా నరసింహారెడ్డి ప్రస్తుతం మెల్లగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా, మెగా తనయుడు రామ్ చరణ్, తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై ఈ సినిమాను ఎంతో భారీ ఖర్చుతో నిర్మించడం జరిగింది. ఇక ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యావరేజ్ టాక్ ని సంపాదించడంతో, తదుపరి కొరటాల శివ దర్శకత్వంలో నటించబోయే 152వ సినిమా విషయమై మెగాస్టార్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

ఇటీవల అధికారిక పూజ కార్యక్రమాలతో ఎంతో లాంఛనంగా ప్రారంభమయిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించే ఈ సినిమాలో మెగాస్టార్ ఒక మంచి పవర్ఫుల్ రోల్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఆయన నటించబోయే తదుపరి 153వ సినిమాకు సంబంధించి అప్పుడే టాలీవుడ్ లో చర్చలు మొదలయ్యాయి. ఇక నేడు కొన్నో టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, 

ఆ సినిమాకు యువ సంచలన దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించనున్నట్లు చెప్తున్నారు. ఇటీవల మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా తెరకెక్కి సూపర్ హిట్ కొట్టిన లూసిఫయర్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం . పూర్తి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఆ సినిమాను, మన తెలుగు నేటివిటీకి తగ్గట్లు సుకుమార్ కొన్ని మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించనున్నట్లు చెప్తున్నారు. కాగా మెగాస్టార్ కూడా సుకుమార్ తో ఈ సినిమా చేయడానికి ఎంతో సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది....!!


మరింత సమాచారం తెలుసుకోండి: