టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి చాలా కాలం తరువాత టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్నారు. మరొక నటి సంగీత, కమెడియన్ బండ్ల గణేష్ కూడా టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. 

మహేష్, దిల్ రాజు, అనిల్ సుంకర కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాను రాబోయే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్లు నిన్న సినిమా యూనిట్ అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. ఇకపోతే నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధాని విజయవాడలో సందడి చేసారు. విజయవాడ బందరు రోడ్ లోని భీమాస్ జ్యువెలరీ షోరూమ్ ఓపెనింగ్ సందర్భంగా అక్కడకు విచ్చేసిన మహేష్, తనకు ఇష్టమైన ప్రాంతమైన బెజవాడకు రావడం ఎంతో అందంగా ఉందని, తనపై అభిమానులు కురిపిస్తున్న ఈ అభిమానానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని జ్యువెలరీ షోరూమ్ ఓపెనింగ్ సందర్భంగా మాట్లాడుతూ చెప్పారు. 

ఇక మహేష్ రాకతో విజయవాడలోని బందర్ రోడ్ ప్రాంతం అంతా జన సందోహంతో నిండిపోయింది. అక్కడి ఫేమస్ గేట్ వే హోటల్ చుట్టుప్రక్కల ప్రాంతమంతా కూడా మహేష్ రాకతో విపరీతంగా ఫ్లెక్సీలతో కళకళలాడింది. ఇక కొందరు మహేష్ ఫ్యాన్స్ అయితే ఆయన రాకను పురస్కరించుకుని బైక్ ర్యాలీలు అలానే ఆయన ఫ్లెక్సీలు పాలాభిషేకాలు నిర్వహించారు. ముందుకుగా ఫ్లైట్ ద్వారా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మహేష్, అక్కడినుండి కార్ లో విజయవాడకు చేరుకున్నారు. మహేష్ బాబును చూడడానికి పలు ప్రాంతాల నుండి అభిమానులు విపరీతంగా తరలి రావడంతో, ఆ ఏరియాలో భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: