సూపర్ స్టార్ మహేష్ బాబు టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. కాగా ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గతంలో మహేష్ నటించిన 'శ్రీమంతుడు, మహర్షి, భరత్ అనే నేను' చిత్రాలకు బ్రహ్మాండమైన సంగీతం అందించిన దేవి శ్రీ 'సరిలేరు నీకెవ్వరు'కు మాత్రం అంతకు మించి ట్యూన్స్ కడుతున్నాడట. మొత్తానికి ఈ సినిమాకి దేవి శ్రీ కసితో పనిచేస్తున్నాడని సంగీతం అదరగొట్టేశాడని, పూర్తి సంతృప్తిగా ఉండనుందని ఇండస్ట్రీలో ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఇకపోతే సినిమా మొదలయ్యేటప్పుడే మంచి సంగీతం ఇస్తానని దేవి శ్రీ సభా ముఖంగా మాటిచ్చిన సంగతి తెలిసిందే. కాగా ప్రిన్స్ మహేష్ నేడు విజయవాడలో సందడి చేశారు. ఓ నగల దుకాణం ప్రారంభోత్సవానికి హాజరైన మహేష్ కొరకు ఫ్యాన్స్ పోటెత్తారు. దీనితో ఆ ప్రాంతం అంతా ఫ్యాన్స్ తో కిక్కిరిసిపోయింది. ఇక ఈ సినిమా షూటింగ్ 75 శాతం పూర్తి అయిందని తెలుస్తోంది. కాగా మహేష్ అప్పుడే అంత షూటింగ్ పార్ట్ ను పూర్తి చేశాడా అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. ఇక మహేష్ బాబు ఎప్పుడు సెలవులు వచ్చినా తన కుటుంబంతో విదేశాలకు వెళ్తారు. దుబాయ్ మహేష్ బాబుకు ఇష్టమైన హాలిడే స్పాట్. సమయం దొరికినప్పుడల్లా మహేష్ తరచూ అక్కడకి వెళ్తుంటారు. కాగా రీసెంట్ గా మహేష్ తన భార్య మరియు పిల్లలతో కలిసి దుబాయ్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. వచ్చే వారం నుండి షూటింగ్ను తిరిగి ప్రారంభిస్తాడట.
ఇక ఈ సినిమాలో మహేశ్ సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ప్రకాష్ రాజ్ , రాజేంద్రప్రసాద్, సంగీత, బండ్ల గణేష్ నటిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఇటీవలే వోగ్ మ్యాగజైన్ కవర్ పేజ్ ఫోటోషూట్లో పాల్గొన్న మహేష్ తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. 'పరాజయాలే నిజమైన నిధి. వాటిని విశ్లేషించుకుని, ఎంతో నేర్చుకున్నాను. ఓటమి ఎదురైనప్పుడు మొదట్లో బాధ ఎక్కువగానే ఉంటుంది. వాటి తట్టుకోవడంలో నమ్రత నాకు సహాయపడింది' అంటూ చెప్పుకొచ్చారు.