టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోల రేస్ లో ముందు వరుసలో ఉంటారు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. మొన్నామధ్య బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాలతో ఒకింత ఢీలా పడ్డ మహేష్ బాబు, ఆ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో నటించిన భరత్ అనే నేను, అలానే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేసిన మహర్షి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ వరుస సక్సెస్ లతో మంచి ఊపు మీదున్నారు. ఇక ప్రస్తుతం యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో హీరోగా నటిస్తున్న సూపర్ స్టార్, ఎలాగైనా ఆ సినిమాతో మంచి హిట్ కొట్టి, మొత్తంగా హ్యాట్రిక్ విజయాలను నమోదు చేయాలని చూస్తున్నారు. 

మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు అన్ని కమర్షియల్ అంశాలను మరియు మాస్ యాక్షన్ ని కలగలిపి దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ సరసన యంగ్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా సీనియర్ నటి విజయశాంతి టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తుండగా, మురళి శర్మ, సంగీత, రాజేంద్ర ప్రసాద్, శ్రీనివాస రెడ్డి, బండ్ల గణేష్, హరితేజ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక నేడు ఒక జ్యువలరీ షోరూం ఓపెనింగ్ సందర్భంగా విజయవాడ విచ్చేసిన సూపర్ స్టార్ మహేష్, అక్కడి అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. 

మొదటినుండి తనకు వెన్నుదన్నుగా నిలుస్తున్న అభిమానులకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని, రాబోయే దీపావళి అందరూ ఎంతో ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు మాట్లాడిన సూపర్ స్టార్, త్వరలో రాబోయే సంక్రాంతికి రానున్న తన లేటెస్ట్ సినిమా సరిలేరు నీకెవ్వరు తప్పకుండా మంచి విజయాన్ని అందుకుని, నా అభిమానులకు కన్నులపండుగగా నిలుస్తుందని షాకింగ్ గా మాట్లాడారు. అయితే మహేష్ గారికి సినిమాపై ఎంతో నమ్మకం ఉండి ఉండడం వల్లనే ఆయన సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని నేడు మాట్లాడడం జరిగి ఉంటుందని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: