టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ట్రెండ్ సెట్టర్ సినిమాగా అర్జున్ రెడ్డి సినిమా నిలిచిపోయింది. అప్పట్లో విడుదలైన ఈ సినిమా హీరో విజయ్ దేవరకొండ కెరియర్ ని మరియు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా నీ ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో డైరెక్టర్లుగా మార్చేసింది. ఈ సినిమా ఇచ్చిన విజయంతో విజయ్ దేవరకొండ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా మారిపోయి వరుస ఆఫర్లు దక్కించుకుంటూ సౌత్ లోనే తన మార్కెట్ విస్తరించేలా ప్లాన్ లు చేస్తూ మంచి ఫేమ్ సంపాదించాడు. ఇదే క్రమంలో అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమా ని కబీర్ సింగ్ గా రీమేక్ చేసి ఇటీవల అదిరిపోయే హిట్ అందుకున్నాడు. ఇటువంటి నేపథ్యంలో ఈ ఇద్దరు ఇటీవల  సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ అవార్డ్స్‌ (సైమా) వేడుకకు హాజరు కావడం జరిగింది.


చాలామంది దక్షిణాది సినిమా రంగానికి చెందిన ప్రముఖులు చిరంజీవి, విజయ్‌ దేవరకొండ, కీర్తి సురేశ్‌, దర్శకుడు సందీప్‌ వంగా, సుకుమార్‌, శ్రియ, నిధి అగర్వాల్‌, పాయల్‌ రాజ్‌పుత్‌, యశ్‌ వంటి సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా యాంకర్ మంజూష...వీరిద్దరి కాంబినేషన్ మళ్లీ ఎప్పుడు రిపీట్ అవుతుంది అని అడిగింది. దానికి విజయ్ ఆప్రశ్నను సందీప్ రెడ్డి వంగ ను అడగమని అన్నారు. ప్రస్తుతం హిందీలో మరో సినిమా ప్లాన్ చేస్తున్న సందీప్ తన తదుపరి చిత్రంగా చేస్తాను అన్నారు.


దీంతో ప్రకటన రాగానే సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ అభిమానులు మరియు తెలుగు సినిమా ప్రేక్షకులు మరో ట్రెండ్ సెట్టర్ సినిమా రాబోతుంది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ మీది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు ఆ సినిమాకి సంబంధించిన షూటింగ్ డిసెంబర్ నెల నుండి మొదలు కానుంది. దీంతో సందీప్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూస్తే పూరి సినిమా తర్వాత సందీప్ రెడ్డి తో విజయ్ దేవరకొండ సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: