తమిళ హీరో  కార్తి నటించిన  లేటెస్ట్ మూవీ ఖైదీ  తమిళ వెర్షన్  ట్రైలర్ కొద్దీ రోజుల కిందట విడుదలై  సూపర్ రెస్పాన్స్ ను రాబట్టుకుంది. తాజాగా కొద్దీ సేపటి క్రితం  తెలుగు  వెర్షన్ ట్రైలర్ ను కూడా  విడుదలచేశారు.  ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే  హీరోయిన్ మరియు సాంగ్స్  లేకుండా  ఈచిత్రాన్ని తెరకెక్కించారని  క్లియర్ గా తెలుస్తుంది.  అలాగే ఈ సినిమా  స్టోరీ అంతా ఒక్క రాత్రి లోనే  జరుగుతుంది.  కార్తి ,యావజ్జీవ ఖైదీ గా కనిపించనుండగా  .. ఈనేపథ్యంలో  జైలు నుండి అతను ఎలా తప్పించుకున్నాడు , మధ్యలో  స్మగ్లింగ్ ముఠా తో   ఎందుకు తలపడాల్సివచ్చింది అనే విషయాలు  ఆసక్తిని రేపుతున్నాయి.  మొత్తానికి  ట్రైలర్  చాలా రియలిస్టిక్ గా ఉండి  సినిమా పై అంచనాలను పెంచేసింది. 



ఇంటెన్సివ్ యాక్షన్  డ్రామా  నేపథ్యంలో లోకేష్  కనకరాజ్ తెరకెక్కించిన  ఈ చిత్రానికి  సామ్ సీఎస్  అందించిన నేపథ్య సంగీతం అదనపు బలం కానుంది.  డ్రీం వారియర్ పిక్చర్స్ పతాకం పై ఎస్ ఆర్  ప్రభు నిర్మించిన ఈ చిత్రం దీపావళికి విడుదలకానుంది.   ఇక ఇదిలా ఉంటే  ఖాకి  తరువాత తెలుగులో కార్తి కి  సరైన సినిమా పడలేదు.  ఈ సినిమా తరువాత కార్తి నటించిన  చినబాబు ,దేవ్ పరాజయాలను చవిచుశాయి.  దాంతో  ఇప్పుడు కార్తికి ఖైదీ విజయం  కీలకం కానుంది. అయితే  తెలుగులో  దీపావళికి  పెద్ద సినిమాల విడుదలలేకపోవడం  ఖైదీ కి కలిసి రానుంది. మరి ఈ చిత్రం తో కార్తి బ్యాక్ టు ఫామ్ అనిపించుకుంటాడో లేదో చూడాలి.   ఇక కార్తి ప్రస్తుతం రెమో ఫేమ్ భాగ్యరాజ్ కణ్ణన్ డైరెక్షన్ లో సుల్తాన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో  కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: