మహర్షి హిట్ తర్వాత మహేష్ బాబు మరో సినిమాలో నటిస్తున్నారు ఆ సినిమానే 'సరిలేరు నీకెవ్వరూ'.. ఈ సినిమా 26 వ సినిమాగా తెరకెక్కుతున్న సినిమా కావడంతో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా లో మహేష్ బాబు కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. గతంలో వచ్చిన మహేష్ బాబు పోలీస్ పాత్రల్లో సినిమాలు అన్ని హిట్ అయ్యాయి అనడంలో సందేహం లేదు. 


ప్రస్తుతం సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన తెరకెక్కించిన ఎఫ్ 2 సినిమా ఎంత హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. 23 ఏళ్ల తర్వాత విజయ శాంతి ఈ సినిమాలో నటిస్తుంది. ప్రకాష్ రాజ్ మరికొందరు సీనియర్ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. 


సెకండ్ షెడ్యూల్ షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది 2020 సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. జనవరి 12 న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నామని చిత్ర యూనిట్ వెల్లడించారు. ఈ సినిమాలో మహేష్ మిలటరీ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఆ సినిమా నుండి ఇప్పటి వరకు వచ్చినటువంటి పోస్టర్స్ , టీజర్స్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తుంది. మొన్న దసరా సందర్బంగా రిలీజ్ అయినా పోస్టర్ మాస్ కోణంలో మహేష్ లుక్స్ అదుర్స్ అని అర్థమవుతుంది. 


మాములుగా మిలటరీ ఆఫీసర్ అంటే బార్డర్ లో గన్ పట్టుకోవాలి. లేకుంటే యుద్ధం అన్న చేయాలి. అంతేగాని, రాయలసీమ కర్నూల్ లో వెళ్లి గోలద్దాలి పట్టుకొని నిలుచున్నాడు. ఎందుకు మహేష్ అలా నిలుచున్నాడు అనేది ఈ సినిమాలోని మెయిన్ ట్విస్ట్. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది. మొన్న ఆమధ్య ఈ సినిమాలోని కథ లీకైంది. మహేష్ తన ఫ్రెండ్ చనిపోతే ఎవరు చంపారు అనేది తెలుసుకోవడానికి కర్నూల్ వెళ్తాడని కథ నడుస్తుంది. మరి ఈ సినిమాలో అదే కథ ఉంటుందా లేక వేరే కథతో అల్లారా అనేది తెలియాలంటే సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే.. 


మరింత సమాచారం తెలుసుకోండి: