గౌతమ్ తిన్ననూరి  డైరెక్షన్ లో  నాచురల్ స్టార్ నాని నటించిన చిత్రం  జెర్సీ. స్పోర్ట్స్ డ్రామా గా  తెరకెక్కిన ఈ చిత్రం ఈఏడాది సమ్మర్ లో విడుదలై  విమర్శకుల ప్రశంసలు పొంది  సూపర్ హిట్ అనిపించుకుంది.  ఇక ఈ కల్ట్ మూవీని  బాలీవుడ్ యంగ్ హీరో  షాహిద్ కపూర్ తో  హిందీ రీమేక్ చేయనున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి.  తాజాగా ఈ రీమేక్  గురించి  మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.  షాహిద్ కపూర్ హీరో గా ఒరిజినల్  వెర్షన్ ను డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి ఈ రీమేక్ ను తెరకెక్కించనున్నాడు.  ఈ చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలు  అల్లు అరవింద్, దిల్ రాజు..  అమన్ గిల్ తో కలిసి నిర్మించనున్నారు. కాగా అల్లు అరవింద్ ఇంతకుముందు బాలీవుడ్ లో  అమీర్ ఖాన్ తో గజినీ  రీమేక్  ను నిర్మించగా .. దిల్ రాజు కు మాత్రం అక్కడ ఇదే మొదటి సినిమా. ఈ చిత్రాన్ని ఆగస్టు 28 , 2020కి ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు. 



ఇక షాహిద్ కపూర్   ఇటీవల  కబీర్ సింగ్ తో  ప్రేక్షకులముందుకు వచ్చి భారీ హిట్ కొట్టాడు.  బ్లాక్ బాస్టర్ తెలుగు మూవీ అర్జున్ రెడ్డి  రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగ  డైరెక్ట్ చేశాడు.  ఒరిజినల్ వెర్షన్ ను కూడా ఆయనే తెరకెక్కించిన  విషయం తెలిసిందే. జూలై లో విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ  270కోట్ల వసూళ్లను రాబట్టి  ఈఏడాది హిందీ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ చిత్రంగా  రికార్డు సృష్టించింది.  దాంతో  షాహిద్  కపూర్  మరో తెలుగు  రీమేక్ లో  నటించడానికి రెడీ అయ్యాడు. మరి ఈజెర్సీ రీమేక్  షాహిద్ కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.   ఈచిత్రం కోసం షాహిద్ ఏకంగా 35కోట్ల రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నాడని బాలీవుడ్ మీడియా వెల్లడించింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: