ఒక్కో వారం ఒక్కో అంశం హైలెట్ అవ్వడం అందరకీ తెలిసిన విషయమే అయితే గత రెండు వారాలుగా ఒకే టాపిక్ ట్రేండింగ్ లో ఉండటం విశేషం.రెండు వారాలుగా దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. బిగ్‌బాస్ తెలుగు, సైరా, తమన్నా, చిరంజీవి, జగన్ లకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి.అందులో అతి ముఖ్యమైనది మాత్రం సైరా నరసింహా రెడ్డి సినిమా.

ఇటు సినీరంగం, అటు రాజకీయరంగం రెండింటిలోనూ మెగాస్టార్ సుపరిచితులే. ఒకప్పుడు సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన చిరు రాజకీయ రంగంలో కూడా కాస్తో కూస్తో రాణించారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి చివరకు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక గత కొంతకాలంగా రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న మెగాస్టార్ చిరంజీవి.ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని కలవబోతున్నారనే వార్త ప్రాధాన్యత సంతరించుకుంది.అందులో భాగం గా అటు జగన్ సైతం సినిమా పై స్పందించడం చాలా ఆస్చరానికి గురి చేసింది.

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక సినిమా 'సైరా నరసింహా రెడ్డి' జోష్ కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ ఓ రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. సరిగ్గా ఈ తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకోబోతున్న ఓ నిర్ణయం 'సైరా నరసింహా రెడ్డి' సినిమాకు బాగా కలిసొస్తుందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇంతకీ ముఖ్యమంత్రి తీసుకోనున్న ఆ నిర్ణయం ఏంటి? సైరాకు ఎలా ప్లస్ అవుతుంది? వివరాల్లోకి పోతే.

మిల్క్ బ్యూటీ తమన్నాపై చిరంజీవి చేసిన కామెంట్స్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఇటీవలే విడుదలైన చిరంజీవి చారిత్రాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి' ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించి, తెలుగు సినిమా స్థాయిని మరోసారి ఎలుగెత్తి చాటిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా కళా బంధు టీ. సుబ్బిరామిరెడ్డి సైరా యూనిట్ పై అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ వేదికపై మాట్లాడిన చిరంజీవి.. తమన్నా క్యారెక్టర్ గురించి ఆసక్తికరంగా మాట్లాడారు. ఇలా చిరంజీవి సినిమాకి ఎంతో రెస్పాన్స్ రావడం చాలా సంతోషాన్ని ఇచ్చిందంటూ అటు రామ్ చరణ్, ఇటు మెగా అభిమానుల్లో కూడా ఆనందాన్ని నింపింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: