బుల్లితెర మీద సత్తా చాటిన నటుడు  ఓంకార్‌ రాజుగారి గది సినిమాతో వెండితెర మీద కూడా సూపర్‌ హిట్ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. అదే జోరులో స్టార్ హీరో నాగార్జునతో రాజుగారి గది 2 సినిమాను రూపొందించి అందరిని ఆకట్టుకున్నాడు. ఇప్పుడు అదే సిరీస్‌లో మూడో భాగంగా రాజుగారి గది 3 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొని రాబోతున్నాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న అక్టోబర్‌ 18న ప్రేక్షకుల వస్తుంది. 


స్టార్ హీరోయిన్ స్టాటస్ లో ఉండీ ఒక కొత్త హీరో సరసన అంగీకరించాలంటే దానికి చాలా చాలా  లెక్కలు ఉంటాయి. లాజిక్ లు వర్కువుట్  కచ్చితంగా కావాల్సి ఉంటుంది. పారితోషికాలు వంటి లాంటి వాటిని డిసైడ్ చేస్తుంటాయి. అయితే ఇలాంటి కారణమే `రాజుగారి గది 3` నుంచి మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా తప్పుకోవడానికి ముఖ్య కారణమని ప్రచారం జరిగింది.


ఇక కాజల్ .. తమన్నా లాంటి స్టార్లు అంగీకరించి ఆ తర్వాత వదులుకున్న ప్రాజెక్టుగా రాజుగారి గది 3 పాపులరైంది. కొత్త హీరో అశ్విన్ సరసన నటించడం ఇష్టం లేకే తమన్నా షూటింగ్ మొదటిలోనే పాల్గొని వదిలేసిందని చెప్పుకున్నారు. అయితే అది నిజమా? అంటే కానేకాదని ఈ యంగ్ హీరో అంటున్నాడు.


ఇక హీరో అశ్విన్ మాత్రం  మీడియాతో మాట్లాడుతూ.. ``తమన్నాను తప్పించనూ లేదు. తాను తప్పుకోనూ లేదు. కాల్షీట్ల సమస్య వల్ల తప్పుకుంది!`` అని తెలివైన జవాబు ఇచ్చాడు. మిల్కీ స్థానంలో వచ్చిన అవికా అద్భుతంగా పెర్ఫార్మన్స్ చేసింది అని చెప్పారు. ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 18న సినిమా విడుదలవుతోంది. సినిమా హిట్టయితే తమన్నా తీసుకున్న నిర్ణయం తప్పు అయినట్టు.. ఫ్లాపైతే కరెక్టేనని మాట్లాడుకుంటారు అందరు. అసలింతకీ తమన్నా ఎందుకు తప్పుకుంది? అన్నది తమ్మననే  చెప్పాల్సి ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: