సుధీర్ బాబు సరసన నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ నభ నటేష్, ఫస్ట్ మూవీ తోనే మంచి హిట్ ని సొంతం చేసుకుంది. అంతేకాక ఆ సినిమాలో ఆమె నటనకు ఆడియన్స్ నుండి మంచి మార్కులే పడ్డాయి. అంతేకాక ఆ సినిమా తరువాత టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన తదుపరి ఇస్మార్ట్ శంకర్ కోసం ఒక హీరోయిన్ గా ఆమెను సెలెక్ట్ చేయడం జరిగింది. 

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కిన ఆ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలవడం, అలానే దర్శకుడు పూరి, హీరో రామ్ సహా, అందులో నటించిన మరొక హీరోయిన్ నిధి అగర్వాల్ తో పాటు నభకు కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే ఆ సినిమా విజయం తరువాత నభకు వరుసగా మంచి అవకాశాలు వస్తున్నప్పటికీ, ఆమె మాత్రం ఎంతో ఆచితూచి తన తదుపరి సినిమాలు సెలక్ట్ చేసుకుంటోందట. ఇకపోతే ప్రస్తుతం రవితేజ సరసన డిస్కో రాజా సినిమాలో ఒక హీరోయిన్ గా నటిస్తున్న నభ, నేడు ఒక రెడ్ కలర్ మెర్సిడెస్ బెంజ్ కారును కొనుగోలు చేసి, 

ఆ కారుతో సరదాగా ఫోజులిచ్చిన ఫోటోలను తన సోషల్ మీడియా మాధ్యమాల్లో అప్ లోడ్ చేయడం జరిగింది. అయితే ఇస్మార్ట్ శంకర్ మంచి విజయాన్ని అందుకున్న తరువాత, ఆ విజయానికి గుర్తుగా నేడు ఈ కారు కొనుగోలు చేసినట్లు చెప్తోంది ఈ భామ. కాగా నేడు ఆమె తన కారుతో దిగిన ఈ ఫోటోలు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా హల్ చల్ చేస్తున్నాయి. ఇక తమ ఫేవరెట్ హీరోయిన్ బెంజ్ కారు కొనడంతో, ఆమె ఫ్యాన్స్ ఎంతో ఉబ్బితబ్బిబ్బయి, ఎంతో ఆనందంతో తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఆమెకు అభినందనలు తెలియచేస్తున్నారు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: