ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా ఓ వెలుుగు వెలిగిన ముద్దుగుమ్మ శృతి హాసన్‌ కొంత కాలంగా వెండితెరకు దూరంగా ఉంటోంది. కొంతకాలం ఫారిన్‌లో బాయ్‌ ఫ్రెండ్‌తో ఎంజాయ్‌ చేసిన ఈ భామ కొద్ది రోజుల క్రితం అతనికి బ్రేక్‌ చెప్పేసి ఇండియా వచ్చింది. తాజాగా తిరిగి సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీకి సిద్దమవుతుంది. అయితే ఇటీవల ఈ భామ ఓ టాక్‌ షోలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఓ డిజిటల్‌ ప్లాట్‌ ఫాం కోసం మంచు లక్ష్మీ చేస్తున్న టాక్‌ షో ఫీట్ అప్‌ విత్‌ స్టార్స్‌. తారల బెడ్‌ టైం స్టోరీస్‌ పేరుతో ప్రమోట్ చేసిన ఈ షో వూట్స్‌ లో ప్రసారమవుతోంది. ఈ షో స్టార్ వారసులు శృతి హాసన్‌ సందడి చేసింది. ఈ సందర్భంగా తన కెరీర్‌, లవ్‌ లైఫ్‌తో పాటు తన పర్సనల్‌ అలవాట్లకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది శృతి.


నీకు మందు తాగే అలవాటు ఉందా అని మంచు లక్ష్మీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా తనకు విస్కీ అంటే చాలా ఇష్టమని చెప్పింది. గతంలో తాను విస్క్రీ తాగేదాన్ని అన్న శృతి ఇటీవల ఆ అలవాటును మానుకున్నానని తెలిపింది.


అయితే సడన్‌గా ఆల్కహాల్‌ మానేయటంతో తన ఆరోగ్యం కూడా దెబ్బతిన్నట్టుగా తెలిపింది.`ఒక్కసారిగా విస్కీ మానేయటంతో నా ఆరోగ్యం దెబ్బతింది. అయితే ఈ విషయాన్ని నేను ఎవరితో షేర్‌ చేసుకోలేదు. అది పూర్తిగా నా వ్యక్తిగతమైన విషయం. అందుకే ఈ సమయంలో ఎవరి సహాయం తీసుకోలేదు. కొద్ది రోజుల చికిత్స తరువాత నేను తిరిగి మామూలు మనిషినయ్యా`నని వెల్లడించింది.


ఇదే షోలో తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌ మైఖేల్ కోర్సలే గురించి కూడా అభిమానులతో పంచుకుంది శృతి. తాను చాలా కూల్‌, ఎమోషనల్‌ పర్సన్‌ అన్న శృతి, ఆ కారణంగానే అందరూ తనపై అధికారం చలాయిస్తారని వెల్లడించింది. అయితే మైఖేల్‌తో తన ప్రయాణం మాత్రం తనకు మంచి పాఠం అని తెలిపిన ఈ భామ విడిపోవడానికి కారణాలు మాత్రం వెల్లడించలేదు.


ఇక తన కెరీర్‌, పర్సనల్‌ లైఫ్‌ గురించి నెగెటివ్ కామెంట్స్‌ చేసేవారిని తాను అస్సలు పట్టించుకోనంది శృతి హాసన్‌. తనకు సంబంధం లేని వ్యక్తులు చేసే కామెంట్స్‌కు అసలు స్పందినన్న శృతి, రొటీన్‌ క్యారెక్టర్స్ వస్తున్న కారణంగానే సినిమాలను బ్రేక్‌ తీసుకున్నానని వెల్లడించింది. ప్రస్తుతం ఈ భామ హిందీలో `పవర్‌`, తమిళ్‌లో `లాభం` సినిమాల్లో నటిస్తోంది.

ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా ఓ వెలుుగు వెలిగిన ముద్దుగుమ్మ శృతి హాసన్‌ కొంత కాలంగా వెండితెరకు దూరంగా ఉంటోంది. కొంతకాలం ఫారిన్‌లో బాయ్‌ ఫ్రెండ్‌తో ఎంజాయ్‌ చేసిన ఈ భామ కొద్ది రోజుల క్రితం అతనికి బ్రేక్‌ చెప్పేసి ఇండియా వచ్చింది. తాజాగా తిరిగి సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీకి సిద్దమవుతుంది. అయితే ఇటీవల ఈ భామ ఓ టాక్‌ షోలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఓ డిజిటల్‌ ప్లాట్‌ ఫాం కోసం మంచు లక్ష్మీ చేస్తున్న టాక్‌ షో ఫీట్ అప్‌ విత్‌ స్టార్స్‌. తారల బెడ్‌ టైం స్టోరీస్‌ పేరుతో ప్రమోట్ చేసిన ఈ షో వూట్స్‌ లో ప్రసారమవుతోంది. ఈ షో స్టార్ వారసులు శృతి హాసన్‌ సందడి చేసింది. ఈ సందర్భంగా తన కెరీర్‌, లవ్‌ లైఫ్‌తో పాటు తన పర్సనల్‌ అలవాట్లకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది శృతి.

మరింత సమాచారం తెలుసుకోండి: