నటించడం మినహా బయట ప్రపంచంతో తనకు సంబంధం లేనట్టుగా ఏ కార్యక్రమంలోనూ పాల్గొనడానికి ఇష్టపడదు నయన్. బహుశా గతంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలే ఇందుకు కారణం కావచ్చు1984లో పుట్టిన
నయనతార తన కన్నా చిన్నవాడైన విఘ్నేశ్శివన్తో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే.కానీ విఘ్నేశ్శివన్,
నయనతార కలిసి సహజీవనం చేస్తున్నా, ఆ విషయాన్ని గానీ, వారి
ప్రేమ బంధాన్ని కాన్నీ బహిరంగంగా ఎక్కడా వెల్లడించలేదు.
ఇక ఇటీవల ఒక ఆంగ్ల పత్రికకు స్పెషల్ ఫొటో సెషన్తో పాటు ఇంటర్వ్యూ కూడా ఇచ్చిన
నయనతార తానేమనుకుంటున్నానో ఆ ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు అని పేర్కొంది.అలాగే వీరి పెళ్లిపై జరుగుతున్న ప్రచారాన్ని విఘ్నేశ్శివన్ సైతం ఖండించారు. ఒక్క విషయాన్ని మాత్రం
నయనతార స్పష్టంగా చెప్పింది.తాను ప్రతి నిమిషం భయంతోనే జీవిస్తున్నానని, అందుకు కారణం మంచి చిత్రాన్ని తన అభిమానులకు ఇవ్వలేనానని చెప్పింది.
నయనతార నటుడు విజయ్తో నటించిన బిగిల్ చిత్రం షూటింగ్ను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రం దీపావళికి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధం అవుతోంది. ఆ తరువాత రజనీకాంత్తో జతకట్టిన దర్బార్ సంక్రాంతి సంబరాలకు సన్నద్ధం అవుతోంది. ఇకపోతే తాను మాట్లాడడం కంటే తన చిత్రాలే మాట్లాడాలని భావించే నటినని పేర్కొంది నయన తార.
ఇక పోతే 34 ఏళ్ల ఈ ముద్దు గుమ్మ తన వయసు ముఖంలో కనిపించకుండా, తన అందాన్ని పరిరక్షించుకోవడానికి పరిష్కారం కోసం ప్రయత్నాలు మొదలెట్టగా, తన మాతృగడ్డ అయిన కేరళలోనే అందుకు తగిన చికిత్స ఉందని తెలుసుకుందట. అంతే షూటింగ్లకు కాస్త గ్యాప్ చూసుకుని ఇటీవల అందాన్ని మెరుగు పరిచే చికిత్సను తీసుకుందనే ప్రచారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇకపోతే ఈ అమ్మడు నవఅందాలతో దిగిన ఫొటోలను నెటిజన్లు చేస్తూ పండగ చేసుకుంటున్నారు.