మెగాస్టార్ చిరంజీవి... ఆయన నటన లో ఉంటుంది పర్ఫెక్షన్...ఆయన  పేరే ఒక సెన్సేషన్... ఈయన అందరికీ ఇన్స్పిరేషన్. టాలీవుడ్ పెద్దల్లో  ఒకరైన  చిరంజీవికి ఉన్న క్రేజ్  గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి స్క్రీన్ మీద  కనిపిస్తే చాలు ఉర్రూతలూగిపోయే  అభిమానులు ఎందరో . ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి... అంచలంచలుగా ఎదుగుతూ అభిమానులకు మెగాస్టార్ గా మారాడు. కామెడీలో పర్ఫెక్షన్ చూపించాలన్న... డాన్సులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు అన్న... మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అంటూ  పవర్ ఫుల్ డైలాగులు చెప్పాలన్నా చిరంజీవికి సాటి ఎవ్వరు లేరు. అందుకే టాలీవుడ్ లో ఆయనకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఎంత మంది యువ హీరోలు వచ్చి స్టార్ హీరోలుగా  మారిన... చిరంజీవి చరిష్మా  మాత్రం చెక్కుచెదరలేదు. 

 

 

 

 

 

 ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వెళ్లి మళ్లీ సినిమాల్లోకి అడుగు పెట్టినప్పటికీ... అభిమానుల్లో  ఆయన క్రేజ్ అస్సలు తగ్గలేదు. అందుకే మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ కొట్టారు చిరంజీవి. ఇక తాజాగా చిరంజీవి కథానాయకుడిగా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమా చిరంజీవి సినీ కెరీర్ లోనే భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలి తెలుగు స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా... భారీ వసూళ్లు  కూడా రాబట్టింది. అయితే సైరా నరసింహారెడ్డి భారీ హిట్ తర్వాత... మెగాస్టార్ చిరంజీవి తర్వాత సినిమా ఏంటనే  దానిపై అందరి చూపు పడింది. 

 

 

 

 

 అయితే చిరంజీవి 152 సినిమా సక్సెస్ ఫుల్ డైరెక్టర్  కొరటాల శివ దర్శకత్వంలో రాబోతుంది. సామాజిక సందేశంతో కూడిన వినోదభరితమైన  సినిమా చిరు కొరటాల శివ కాంబినేషన్లో రాబోతుంది. అయితే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా 152 సినిమా పూర్తయ్యే లోపే మరో ప్రాజెక్టును కూడా సిద్ధంగా ఉంచాలని ఉద్దేశంతో చిరంజీవి రామ్ చరణ్ ఉన్నారట. అయితే ఈ మధ్య మలయాళంలో మోహన్ లాల్  నటించిన  హిట్ మూవీ లూసిఫర్ ను తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అయితే ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ని రాంచరణ్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు దర్శకుడిగా  సుకుమార్ పేరు కనిపిస్తుంది. రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగా ఫ్యామిలీ తో సుకుమార్ కి మంచి సాన్నిహిత్యం ఏర్పడిన విషయం  తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: