టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా సెన్ సేషన్ ని క్రియోట్ చేసిన సినిమా అర్జున్ రెడ్డి...కబీర్ సింగ్. ఒకే కథ రెండు ఇండస్ట్రీలోను హీరోలకు డైరెక్టర్ కి స్టార్ ఇమేజ్ ని తీసుకు వచ్చింది. డైరెక్టర్
సందీప్ రెడ్డి ఒక్క సినిమాతోనే ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో పెద్ద దర్శకుల జాబితాలోకి చేరిపోయారు. ఇప్పుడు రెండు చోట్లా
సందీప్ పేరు మార్మోగిపోతోంది. వాస్తవంగా చూస్తే సాధారణ సినిమాలు వేరు.. క్రేజీ కాంబినేషన్లు వేరు.
సందీప్ రెడ్డి వంగా-
విజయ్ దేవరకొండ కాంబినేషన్ ఎలాంటిదో ఇండస్ట్రీలో ఎవరైనా చెప్తారు. మరోసారి ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారంటే ఇక ఆ సినిమాని అనౌన్స్ చేసిన రోజు నుంచే క్రేజీ ప్రాజెక్టుగా మారిపోతుంది.
'అర్జున్ రెడ్డి' తర్వాత
సందీప్ కు బాలీవుడ్ అవకాశం రావడంతో తన సినిమానే హిందీలో 'కబీర్ సింగ్' గా రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ సాధించడం ఇప్పుడు సంచలనం. ఆ సినిమా తర్వాత
సందీప్ తన రెండవ సినిమా కూడా బాలీవుడ్ లోనే రెడీ అవుతున్నాడు. రీసెంట్గా అఫీషియల్ గాను ఈ సినిమా గురించి వెల్లడించారు. అయితే
సందీప్ బాలీవుడ్ జర్నీ సరే.. మరి
విజయ్ దేవరకొండతో మరోసారి సినిమా ఎప్పుడు చేస్తారు అని మీడియాలో అడగగానే క్షణం ఆలోచించకుండా ఆన్సర్ ఇచ్చాడు. ప్రస్తుతం చేస్తున్న హిందీ సినిమా తర్వాత
విజయ్ తోనే చేస్తానని చెప్పాడు.
సందీప్ తన మొదటి బాలీవుడ్ సినిమాతో హిందీ ప్రేక్షకులను క్లీన్ బౌల్డ్ అయ్యోలా చేశాడు. ఒక్కసారిగా బాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ గా మారాడు. అందుకే మరో ఆఫర్ వెతుక్కుంటూ వచ్చింది. ఈ సినిమా తర్వాత
విజయ్ కాంబినేషన్ లో సినిమా అంటే ఆది దాదాపుగా ప్యాన్
ఇండియా సినిమాగా తయారయ్యో అవకాశం ఉంటుంది. ఏదేమైనా
విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు ఇది క్రేజీ అప్డేట్ అనే చెప్పాలి. ఇక
సందీప్ బాలీవుడ్ కబీర్ సింగ్ తర్వాత
మహేష్ తో చేయాలనుకున్నాడు. లైన్ కూడా వినిపించాడు. కానీ ఎందుకనో ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇంకా ఎలాంటి అప్డేట్ రాలేదు.
సందీప్ ఎటు బాలీవుడ్ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు కాబట్టి ప్రస్తుతానికి
మహేష్ తో సినిమా లేనట్టే అని తెలుస్తోంది.