సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ కి బంపర్ బొనాంజా ఇవ్వబోతున్నాడు. త్వరలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న `సరిలేరు నీకెవ్వరు` సినిమాతో సంక్రాంతికి బరిలోకి దిగుతున్న మహేష్ త్వరలో ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి సర్ ప్రైజ్ చేయబోతున్నాడు. తన కొడుకు గౌతమ్ తో కలిసి `వన్ నేనొక్కడినే` చిత్రంలో నటించిన మహేష్ ఈ సారి తన కొడుకునీ - కూతురితో కలిసి ఓ యాడ్ ఫిల్మ్లో కనిపించబోతున్నాడని తెలిసింది. ఇది నిజంగా మహేష్ ఫ్యాన్స్ కు పండగే.

 

అయితే ఈ ఆలోచన మాత్రం మహేష్ వైఫ్ నమ్రతదే. `పోకిరి` తరువాత నుంచి మహేష్ స్టైల్ ని - మొత్తంగా మహేష్ నే మార్చేసిన నమ్రత సినిమాల్లో మాత్రమే నటిస్తున్న మహేష్ ని కమర్షియల్ యాడ్ ఫిల్మ్స్లో నటించేలా చేసి తనని భారీ స్థాయిలో ప్రమోట్ చేయడం మొదలుపెట్టింది. గత కొంత కాలంగా సోషల్ మీడియా వేదికగా తన కొడుకు గౌతమ్ ని - కూతురు సితారని కూడా ప్రమోట్ చేయడం మొదలుపెట్టిన నమ్రత త్వరలో మహేష్ తో పాటు తను -  తన కొడుకు కూతురుతో కలిసి ఓ యాడ్ ఫిల్మ్లో కనిపించబోతందని వినిపిస్తోంది.

ఓ రియల్ ఎస్టేట్ కు సంబంధించి కమర్షియల్ లో మహేష్ సతీ సమేతంగా హంగామా చేయబోతున్నారన్న మాట. ఇప్పటికే ఈ యాడ్ ఫిల్మ్ కి సంబంధించిన షూటింగ్ పూర్తయిందట. ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్ పూర్తి కాగానే యాడ్ ఫిల్మ్ ఏయిర్ కానుందట. మహేష్ మాత్రం గౌతమ్ని కాలేజీ పూర్తియిన తరువాత సినిమాల్లోకి తీసుకురావాలని ఆలోచిస్తుంటే నమ్రత మాత్రం కిడ్స్ స్టేజ్ లోనే వాళ్లని స్టార్స్ ని చేయాలని ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: