‘బాహుబలి’ తో నేషనల్ సెలెబ్రెటీ స్థాయి ప్రభాస్ కు వచ్చింది. అయితే అనుకోకుండా ఇప్పుడు చరణ్ జూనియర్ లు కూడ ‘బాహుబలి’ ద్వారా గుర్తింపు పొందబోతున్న ఒక ఆశ్చర్య సంఘటన జరగబోతోంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 19న లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ మ్యూజిక్ హాలులో ‘బాహుబలి’ మూవీ ప్రత్యేక ప్రదర్శన జరగబోతున్న విషయం తెలిసిందే. 

ఈ మూవీలోని డైలాగ్స్ వస్తుండగా ఈ మూవీకి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను లైవ్ ఆర్కెస్ట్రా సహాయంతో కీరవాణి ట్రూప్ రాయల్ ఆల్బర్ట్ హాలులో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు. భారత సినిమా రంగానికి సంబంధించి ఈ అరుదైన గౌరవం ఇప్పటి వరకు ఒక్క ‘బాహుబలి’ కి తప్ప మరే సినిమాకు లభించలేదు. 

ఈ సినిమా ప్రదర్శనకు ముందు రాజమౌళిని లండన్ మీడియా కొన్ని ప్రశ్నలు ‘బాహుబలి’ కిసంబంధించి అడగబోతోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహింపబడుతున్న ఈ కార్యక్రమానికి రాజమౌళి ప్రభాస్ రానా అనుష్క తమన్నాలు హాజరవుతున్నారు. 

అయితే ఈ ‘బాహుబలి’ మూవీతో సంబంధంలేని చరణ్ జూనియర్ లు కూడ ‘బాహుబలి’ టీమ్ తో కలిసి ఇప్పుడు లండన్ వెళ్ళబోతూ ఉండటం హాట్ టాపిక్ గా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు రాజమౌళి ప్రత్యేకంగా చరణ్ జూనియర్ లను తనతో లండన్ తీసుకు వెళ్ళడం వెనుక ఒక కారణం ఉంది అని అంటున్నారు. ‘బాహుబలి’ కి సంబంధించి రాజమౌళి లండన్ లోని మీడియాతో మాట్లాడుతున్న నేపధ్యంలో పనిలో పనిగా చివర్న తన లేటెస్ట్ మూవీ ‘ఆర్ ఆర్ ఆర్’ గురించి చెప్పడమే కాకుండా ఈ మూవీలో హీరో పాత్రలను చేస్తున్న చరణ్ జూనియర్ లను లండన్ మీడియాకు పరిచయం చేయడానికి వీరిద్దరినీ తన భాహుబలి టీమ్ తో కలిసి తీసుకు వెళుతున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: