విక్టరీ
వెంకటేష్ , యువ సామ్రాట్
నాగ చైతన్య కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ వెంకీమామ షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా విడుదల తేదీ పై ఇప్పటివరకు ఓ క్లారిటీలేదు. మొదటగా
దసరా కు ఈ చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకురావాలని అనుకున్నారు. కానీ షూటింగ్ లో వెంకటేష్ గాయపడడం అలాగే
దసరా కు సైరా విడుదలకావడంతో పోటీ నుండి తప్పుకుంది. ఆతరువాత సోలోగా దీపావళికి బరిలోకి నిలపాలని అనుకున్నారు. కానీ అప్పటికి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కావడం లేదు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కాబట్టి ఎలాగైనా పండగ కే సినిమా విడుదలచేస్తే బాగుంటుందని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారని దాంతో ఈ చిత్రం సంక్రాంతి కి బరిలోకి దిగనుందని కొద్దీ రోజులుగా మీడియా లో వార్తలు వచ్చాయి. అయితే ఫిలిం నగర్ వర్గాల నుండి వస్తున్న తాజా సమాచారం ప్రకారం వెంకీమామ సంక్రాంతి రేస్ నుండి తప్పుకుందట. దానికి కారణం డిస్ట్రిబ్యూటర్ల నుండి ఒత్తిడే అని తెలుస్తుంది.
ఇప్పటికే పండగకు మహేష్ బాబు ,సరిలేరు నీకెవ్వరు , అల్లు అర్జున్ అల .. వైకుంఠపురములో ,రజినీకాంత్, దర్బార్ , కళ్యాణ్ రామ్ , ఎంత మంచివాడవురా సినిమాలు బెర్తులను ఖరారు చేసుకున్నాయి. మరి ఇంత పోటీలో వెంకీమామ ను విడుదలచేస్తే నష్టపోతామని ఎక్సీబ్యూటర్లు , డిస్ట్రిబ్యూటర్లు మేకర్స్ ను కోరారట. దాంతో వెంకీమామ నిర్మాతలు వెన్నక్కి తగ్గారని తెలుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. త్వరలోనే ఈ రిలీజ్ డేట్ విషయంలో అధికారిక ప్రకటన వెలుబడనుంది. బాబీ డైరెక్షన్ లో కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకీ సరసన హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా నాగ చైతన్య కు జోడిగా రాశీ ఖన్నా నటిస్తుంది.