టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో 100 శాతం సక్సస్ రేట్ ఉన్న వ్యక్తులలో రాజమౌళి తరువాత స్థానం కొరటాల శివకు మాత్రమే దక్కుతుంది. ఇప్పటివరకు అతడు తీసిన సినిమాలు అన్ని సూపర్ హిట్ కావడంతో టాప్ హీరోలు అంతా కొరటాలతో సినిమాలు చేయడానికి తెగ ఆతృత కనపరుస్తున్నారు. 

అలాంటి హిట్ ట్రాక్ రికార్డు ఉన్న వ్యక్తి చిరంజీవి కోసం సంవత్సరం పైగా వేచిచూసి లేటెస్ట్ గా మెగా స్టార్ తో మొదలుపెట్టిన మూవీ పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీకి సంబంధించి కొరటాల తయారు చేసిన కధకు సంబంధించి కొన్ని లీకులు బయటకు వచ్చాయి. 

ఈ మూవీ కథ కూడ ఒక మెసేజ్ తో ఉన్నపటికీ ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని సబ్జెక్టు అని అంటున్నారు. బయటకు వచ్చిన ఈ లీకులు  ప్రకారం  చిరంజీవి ఈ మూవీలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉద్యోగి పాత్రలో కనిపిస్తాడని టాక్.  ఎండోమెంట్ డిపార్ట్ మెంట్ లో జరిగే అవినీతి దేవాలయాలను నిర్లక్ష్యం చేయడం వల్ల సమాజానికి జరిగే హాని గురించి కొరటాల ఈ మూవీలో చూపించ బోతున్నట్లు తెలుస్తోంది. 

దేవాదాయ శాఖ అంటే చాలామంది రాజకీయ నాయకుల అవినీతికి దేవాలయాల భూముల కబ్జాకు ఒక కేంద్రం గా భావిస్తారు. వాస్తవానికి  ఇప్పటివరకు ఈ  బర్నింగ్ ఇష్యూ పై ఎవరు ధైర్యం చేసి సినిమాలు  తీయలేదు. ఈ విషయాలకు కమర్షియల్ ఎలిమెంట్స్  టచ్ చేసి కొరటాల చాలా తెలివిగా ఈ మూవీ స్క్రీన్ ప్లే రాసి నట్లు తెలుస్తోంది. ఇలాంటి భావజాలం ఎక్కువగా భారతీయ జనత పార్టీ సిద్దాంతాలలో కనిపిస్తుంది.  దీనితో చిరంజీవి తనకు తెలియకుండానే తన సినిమా ద్వారా భారతీయ జత పార్టీ సిద్ధాంతాలు ప్రచారం చేయబోతున్నాడా అన్న సందేహాలు కలగడం సహజం.. 



మరింత సమాచారం తెలుసుకోండి: