బాలీవుడ్లో ఇప్పుడు స్టార్లకి గడ్డు పరిస్థితి నెలకొంది. బాలీవుడ్ స్టార్లు హిట్లు లేక ఏం చేయాలో తెలియక తికమకపడుతున్నారు. బాలీవుడ్ ఖాన్ త్రయంలో సల్మాన్ ఖాన్ మినహా మిగతా ఇద్దరూ ఖాన్ లు తమ తర్వాతి సినిమాలని ప్రకటించలేదు. ఆమీర్ ఖాన్ కి "దంగల్" తర్వాత సరైన హిట్ లేదు. ఆయన చేసిన "థగ్స్ ఆఫ్ హిందుస్తాన్" ఎంత డిజాస్టరో చెప్పాల్సిన పనిలేదు. షారుక్ ఖాన్ కి చాలా సంవత్సరాలుగా సరైన హిట్ రాలేదు. 


ఆయన చేసిన "జీరో" సినిమా బాక్సాఫీసు వద్ద పరాజయం పాలైంది. స్టార్లు సైతం  మూస కథలతో రావడంతో బాలీవుడ్ జనాలు తిప్పి కొడుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో మాస్ ట్రెండ్ నడుస్తుంది. మాస్ సినిమాలని బాలీవుడ్ జనాలు విపరీతంగా చూస్తున్నారు. బాలీవుడ్ దర్శకులు మాస్ సినిమాలని తీయడంలో చాలా దూరంలో ఉంటారు. ప్రస్తుతం ఒక్క రోహిత్ శెట్టి మినహా బాలీవుడ్ లో మాస్ సినిమా తీసే డైరెక్టరే కనిపించడు.


రోహిత్ శెట్టి సైతం రీమేక్ లనే నమ్ముకున్నాడు. ఆయన తీసిన" సింబా" సినిమా ఘన విజయం సాధించింది. తెలుగు టెంపర్ కి రీమేక్ అయిన సింబాలో రన్ వీర్ సింగ్ హీరోగా నటించాడు. అయితే ప్రస్తుతం రోహిత్ శెట్టి మరో మాస్ సినిమాని రీమేక్ చేయబోతున్నాడని టాక్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన "ఇస్మార్ట్ శంకర్" సినిమాని రోహిత్ శెట్టి రీమేక్ చేయబోతున్నాడట.


బాలీవుడ్ జనాలు మాస్ ని ఎంతగా ఆదరిస్తున్నారో తెలుసుకోవాలంటే, మన తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ కి ఎన్ని వ్యూస్ వస్తున్నాయో చూస్తే అర్థం అవుతుంది. తెలుగులో డిజాస్టర్ అయిన సినిమాలకు సైతం మిలియన్లలో వ్యూస్ వస్తుంటే ఆశర్యం వేస్తుంది. దీంతో ఆలోచనలో పడ్డ బాలీవుడ్ స్టార్స్ మాస్ సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యారట. అది కూడా సౌత్ దర్శకులతో చేయాలనుకుంటున్నారట. షారుక్ ఖాన్ ఆ వైపుగా అడుగులు వేస్తున్నారని సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: