బళ్లాలదేవుడిగా ప్రపంచస్థాయి లో గుర్తింపు పొందిన విలక్షణ నటుడు దగ్గుబాటి రానా ఆరోగ్యం విషయంలో అయోమయంలో పడింది. అతడికేమీ కాలేదంటూ పైకి దగ్గుబాటి కుటుంబం ధీమాగా చెప్పుకొస్తున్నా..రానా లుక్, నెలల తరబడి హైదరాబాద్‌కు దూరంగా ఉంటూ చికిత్స పొందడం అనుమానాల్ని పెంచుతోంది. మరీ జనాలు భయపడుతున్న స్థాయిలో రానా ఆరోగ్యం ప్రమాదంలో లేకపోవచ్చు కానీ అతను ఎంతో కొంత ఇబ్బంది పడుతున్న మాట నిజం అని  ఈ విరామం స్పష్టం చేస్తోంది. 

అతడి లుక్ చూసిన అంతా ఆల్ రైట్ కాదనే విషయం అర్థమవుతోంది. రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు రానా తిరిగి ప్రారంభించడానికి  ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. అందులో ఒకటి హాథీ మేరీ సాథీ. సోలో హీరోగా రానా కెరీర్లోనే అతి పెద్ద ప్రాజెక్టు ఇది. మూడు భాషల్లో భారీ బడ్జెట్లో ఈ చిత్రాన్ని ప్రభు సాల్మన్ రూపొందిస్తున్నాడు. గత ఏడాదే పట్టాలెక్కిన ఈ సినిమా ఇంకా పూర్తి కాకపోవడానికి రానా తీసుకుంటున్న బ్రేకులే కారణం.

ఇక ఈ ఏడాదే మొదలైన ‘విరాట పర్వం’ కూడా షెడ్యూల్ ప్రకారం అన్నీ జరిగి ఉంటే ఈపాటికి పూర్తయ్యేది. ఈ రెండు సినిమాలకు మధ్యలో బ్రేక్ పడగా.. గుణశేఖర్ తలకెత్తుకున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టు ‘హిరణ్య కశ్యప’ ప్రి ప్రొడక్షన్ దశను దాటట్లేదు. పైగా ఈ  రెండు సినిమాలు పూర్తయితే కానీ ఇది పట్టాలెక్కదు. వీటి సంగతే ఇలా ఉంటే రానా ఇప్పుడు కొత్తగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలొస్తున్నాయి. 

ఒక కొరియన్ మూవీని తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేయడానికి రానా ఓకే చేశాడట. సురేష్ ప్రొడక్షన్స్‌లో దీనికి సంబంధించిన వర్క్ నడుస్తోందట. సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. గతంలో రానాతో కలిసి ఆమె ‘కృష్ణం వందే జగద్గురుం’లో నటించిన సంగతి తెలిసిందే. ఐతే రానా ముందు చేతిలో ఉన్న ప్రాజెక్టులు సంగతేదో తేలిస్తే దీని సంగతి ఆలోచించవచ్చు అని అటు ప్రొడ్యూసర్లలో ఇటు దగ్గుపాటి అభిమానుల్లో కూడా ఒక్కంత ఆశ్చర్యం నెలకొంది.రానా ఏమి చెయ్యనున్నాడో కొన్నాళ్లు వేచి చూడక తప్పదు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: