ఓంకార్‌ రాజుగారి గది సినిమాతో వెండితెర మీద కూడా సూపర్‌ హిట్ లభించింది ఓంకార్ కి. అదే తరహాలో స్టార్ హీరో నాగార్జునతో రాజుగారి గది 2 సినిమాను కూడా  రూపొందించి ప్రజలను అందరి అభిమానం దగ్గించుకున్నారు. ఇప్పుడు అదే సిరీస్‌లో మూడో భాగంగా రాజుగారి గది 3 సినిమా రాబోతుంది. రాజుగారి గది త్రీ' అంటూ వస్తున్న ఓంకార్ ఈ సినిమాకు పది సీక్వెల్స్ అయినా చేయడానికి రెడీ అని అంటున్నాడు. 'రాజుగారి గది -10' కూడా వస్తుందని అని తెలుపుతున్నారు. 


రెండో గది అంతగా విజయ రాజకపోయిన. ఎలాంటి స్టార్ క్యాస్ట్ లేని తొలిపార్ట్ విజయవంతం కావడంతో, సీక్వెల్ పార్ట్ లో స్టార్స్ కూడా చేయడం జరిగింది. అది రీమేక్ కాన్సెప్ట్, మలయాళీ సినిమా 'ప్రేతమ్' కు రీమేక్ గా 'రాజుగారి గది 2' ని చిత్రీకరించారు. నాగార్జున, సమంత వంటి వాళ్లు నటించినా ఆ సినిమా హిట్ సాదించ లేకపోయింది. అయితే ఇప్పుడు మూడో పార్టును తీసుకు వస్తున్నారు. హారర్ - కామెడీలకు ఇంకా మార్కెట్ మిగిలేఉందనే ఆశాభావంతో ఈ సినిమాను రూపొందించినట్టుగా ఉన్నారు మరి.


ఇక రెండో సినిమా ఫెయిల్యూర్ కు బాధ్యత నాది కాదు  అన్నట్లుగా మాట్లాడుతున్నాడు ఓంకార్. అది రీమేక్ కావడం, ముందుగా తమన్నాను హీరోయిన్ గా అనుకోవడం.. ఆ సినిమా ఫెయిల్యూర్ కు ఇంకా రకరకాల కారణాలు ఉన్నాయని తెలియచేశారు. మూడో పార్ట్ మాత్రం హిట్ కచ్చితంగా అవుతుంది అని తెలుపుతున్నారు.


ఆ తర్వాత ఈ సినిమాకు నాలుగు, ఐదు.. పదివరకూ సీక్వెల్స్ తీసే ఉద్దేశం కూడా ఉందంటు తెలిపారు ఓం కార్. మరి అన్ని సీక్వెల్స్ కు చాన్స్ ఉందా, అంత సీనుందా.. అంటే ఈ మూడోపార్ట్ విజయమే ఈ విషయాలను తేల్చేస్తుందని అని పరిశీలకులు అంటున్నారు. ఇక ఈ సినిమాకి అవికా గోర్  హీరోయిన్ పాత్ర పోషించింది. చాలా రోజుల తర్వాత తెలుగులోకి మళ్ళీ  రీ ఎంట్రీ ఇస్తుంది. ఖచ్చితంగా అలరిస్తుంది ఆమె కారెక్టర్ అని చిత్ర యూనిట్ అనుకుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: