బిగ్ బాస్ 3 సీజన్లో లో గత వారంలో మహేష్ విట్టా ఎలిమినేట్  అయ్యాడు అని అందరికి తెలిసిందే కదా..బిగ్ బాస్ హౌజ్ అంటేనే ఏడుపుల కార్యక్రమంగా మారిపోయింది ఈ మధ్యకాలంలో. మరీ ముఖ్యంగా ఎవరైనా ఎలిమినేట్ అవుతున్నారంటే చాలు కన్నీటితో హౌజ్ తడిసిముద్దయి పోతుంది. అంతా ఒకటే ఏడుపులు, పెడబొబ్బలు. అదంతా స్క్రిప్టింగా లేక నిజమా అనే విషయాన్ని పక్కనపెడితే.. హౌజ్ నుంచి బయటకు వెళ్లిపోయే పార్టిసిపెంట్లకు మాత్రం మంచి సెండాఫ్ దొరికేది మొత్తానికి. కానీ మహేష్ విట్టా విషయాని కొచ్చేసరికి మాత్రం అదంతా ఒక్కసారిగా మాయమైంది. అసలు ఒక పార్టిసిపెంట్ పోయాడు అని ఏ మాత్రం స్పందన కూడా లేదు.


బిగ్ బాస్ సీజన్-3 క్లైమాక్స్ కు వస్తున్న వేళ.. ఇటీవల జరిగిన కార్యక్రమంలో మహేష్ విట్టా ఎలిమినేట్ అయ్యాడు.  అయితే ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ మాత్రం సోషల్ మీడియాలో చాలా పెద్ద చర్చలు తీసుకొనివచ్చాయి. హౌజ్ లో 2-3 వారాలు ఉండి వెళ్లిపోయిన పార్టిసిపెంట్లపై అపారమైన ప్రేమను కురిపించిన ఇతర పార్టిసిపెంట్లు, దాదాపు 12 వారాల పాటు హౌజ్ లో ఉంటూ అందరికీ వినోదాన్ని పంచిన మహేష్ విషయంలో మాత్రం నిర్లిప్తంగా ఉండిపోయారు ఏ మాత్రం స్పందన కూడా లేదు అంటే నమ్మండి.


మహేష్ బయటకు వెళ్లిపోతుంటే, బాబా భాస్కర్ మినహా ఎవ్వరూ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు అని తెలుస్తుంది. మిగితా పార్టిసిపెంట్స్  అందరూ నవ్వుతూ అతడ్ని పంపించారు హౌస్ నుంచి.  పార్టిసిపెంట్స్ మాత్రం తమకు పోటీగా, అడ్డంకిగా ఉన్న ఓ వ్యక్తి బయటకు వెళ్లిపోయాడనే ఆనందం మాత్రమే వాళ్లలో కనిపించింది. ఇది నిజంగా బాధాకరం. ఉన్నంతలో బాబా భాస్కర్ మాత్రం తన బాధను వ్యక్తం చేశాడు.


హౌజ్ నుంచి బయటకు వెళ్తూ మహేష్ కూడా అతడి కాళ్లకు నమస్కరించి మరీ వెళ్లి పోవడం జరిగింది. ఇక బయటకొచ్చిన తర్వాత మహేష్ విట్టా తనదైన జోస్యం చెప్పాడు. బిగ్ బాస్ టైటిల్ బాబా భాస్కర్ దే అని అంటున్నాడు. అంతేకాదు.. రెగ్యులర్ గా ప్రతి వరం వేసే బిగ్ బాంబ్ శిక్షను శ్రీముఖిపై వేస్తూ వెళ్లిపోయాడు. మొత్తానికి  మహేష్ కు మాత్రం బిగ్ బాస్ హౌజ్ నుంచి సరైన వీడ్కోలు దక్కలేదు అని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: