ఇటీవల ఏపీ సీఎం జగన్‌తో మెగాస్టార్ చిరంజీవి సోమవారం భేటీ కావడం జరిగింది. ఈ మీటింగ్ గురించి వారం నుంచి ప్రచారం ఉన్న సంగతి అందరికి తెలిసిందే కదా.. ఈ మీటింగ్ పై పలు విమర్శలు వినిపించిన చివరికి సైరా  విజయోత్సాహం అనేది తేలింది,.ఇక ప్రత్యేక విమానంలో బేగంపేట నుంచి బయల్దేరిన చిరంజీవి దంపతులు విజయవాడ చేరగానే పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లడం జరిగింది. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్నాక.. సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లారు. జగన్-భారతి దంపతులు.. చిరంజీవి-సురేఖ దంపతులను సాదరంగా ఆహ్వానించడం జరిగింది. 


ఈ సందర్భంగా జగన్‌ను మెగాస్టార్ శాలువా కప్పి సన్మానించారు. చిరంజీవికి బొబ్బిలి వీణను జగన్ బహుకరించారు. జగన్, చిరంజీవి భేటీ ఇటు రాజకీయ, సిని వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. సైరా చిత్ర విశేషాలను జగన్‌కు మెగాస్టార్ వివరించారని.. సైరా మూవీ చూడాలని సీఎంను కోరారు అని సమాచారం. అదనపు షోలు వేయడానికి అనుమతి ఇచ్చినందుకు చిరు జగన్‌కు ధన్యవాదాలు తెలిపారని కూడా సమాచారం. సైరా మూవీకి వినోద పన్ను రాయితీ కల్పించాలని జగన్‌ను చిరంజీవి కోరినట్టు సమాచారం ఉంది.


ఇక జగన్, చిరంజీవి భేటీలో ఆసక్తికరమైన అంశం ఏమిటి అంటే సీఎంకు మెగాస్టార్ పసుపు రంగు శాలువా కప్పడం.ఆంధ్ర ప్రదేశ్లో ‘పచ్చ రంగు’ ప్రాధాన్యం ఏంటో అందరికీ తెలిసిందే. టీడీపీ పార్టీ ఈ రంగును ఓన్ చేసుకుంది అని అందరికి తెలుసు.

చంద్రబాబు ఎవరికైనా పసుపు రంగు శాలువా కప్పేవారు. ప్రధాని మోదీ, కర్ణాటక సీఎం (ఇప్పుడు మాజీ) కుమారస్వామి తదితరులకు ఆయన పసుపు రంగు శాలువానే కప్పారు . టీడీపీ మీద కోపం కారణంగా.. జగన్‌కు ఈ రంగు అంటే నచ్చదనే భావం కూడా అందరికి తెలుసు. మరి ఈ విషయం గమనించాడో లేదో చిరు. ఇపుడు ఈ విషయం పెద్ద వైరల్గా మారింది సోషల్ మీడియాలో.



మరింత సమాచారం తెలుసుకోండి: