ఇటీవల ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి విజయం సొంతం చేసుకున్న నభా నటేష్ కొత్త కారును కొనింది. కారు ముందు నిలబడి ఫొటోలకు బాగా సెక్సీ పోజులిచ్చారు. ఇక సినిమాలో ‘వరంగల్ కాలేజ్లా పోరగాళ్ల చేత ఉచ్చపోయించినా’ అంటూ తనలోని లైవ్ వైర్ను బయటికి తీసింది నభా నటేష్. ‘ ఇస్మార్ట్ శంకర్’ చిత్రంలో రెండో కథానాయికగా నటించిన ఈ భామ టాలీవుడ్లో తనకంటూ మంచి గుర్తింపు లభించింది.
ఈ సినిమా విజయం సాధించాక నభా డిమాండ్ బాగా పెరిగిపోయింది అంటే నమ్మండి. నాలుగు రాళ్లు కూడా వెనకేసుకుంటున్నారు. అందుకే రెడ్ కలర్ మెర్సిడిస్ బెంజ్ కారును కొనింది. కారు ముందు నిలబడి సెక్సీగా ఫోటోలు దిగింది.
పూరీ జగన్నాథ్ సినిమాలో నటించే అవకాశం వస్తే చాలు హీరోయిన్ల కెరీర్ దూసుకుపోతుందని టాలీవుడ్లో ఓ పెద్ద టాక్ ఉంది. ఇప్పుడు నభా నటేష్ కెరీర్ కూడా అలాగే మారిపోయింది. నభా చేతిలో చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అని సమాచారం. ‘ఇస్మార్ట్ శంకర్’ విజయం సాధించిన నేపథ్యంలో దర్శకుడు పూరీ జగన్నాథ్, సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించిన చార్మిలు కూడా రెండు లగ్జరీ కార్లు కొనుక్కున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. పూరీ
ల్యాండ్ రోవర్ కారు కొనుగోలు చేయగా, చార్మి బెంజ్ కారు కొనింది.
19 ఏళ్లకే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నభా నటేష్. తొలి సినిమాలోనే కన్నడ సూపర్స్టార్ శివరాజ్ కుమార్తో కలిసి ‘వజ్రకాయ’ అనే సినిమాతో అడుగుపెటింది. ఎన్నో థియేటర్లలో ఈ సినిమా దాదాపు వంద రోజులు కూడా ఆడింది. ఆ తర్వాత 2018లో వచ్చిన ‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ ప్రేక్షకులకు పరిచయమైంది. దీంతో పాటు ప్రముఖ దర్శకుడు రవిబాబు తెరకెక్కించిన ‘అదుగో’ చిత్రంలోనూ కూడా నటించింది.
ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా నభాకు బాగా ప్లస్ పాయింట్గా మారింది. ఇందులో ఆమె క్యారెక్టర్కు మంచి ప్రశంసలు కూడా రావడం జరిగింది. ప్రస్తుతం ఈ భామ ‘డిస్కో రాజా’ సినిమాలో నటిస్తోంది. మాస్ మహారాజా
రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో పాయల్ రాజ్పుత్ మరో కథానాయికగా పాత్ర పోసిసితున్నారు.