రాజ్ తరుణ్.. షాలిని పాండే హీరో హీరోయిన్లుగా జీ.ఆర్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఇద్దరిలోకం ఒకటే'. ఈ సినిమానుంచి 'యూ ఆర్ మై హార్ట్ బీట్' అంటూ సాగే మొదటి లిరికల్ సాంగ్ ను ఈరోజే విడుదల చేశారు. మిక్కీ జే. మేయర్  ఈ సినిమాకు సంగీతదర్శకుడు.
 
ఈ పాటకు సాహిత్యం అందించినవారు బాలాజీ. 'నువ్వే నువ్వే.. నువ్వే కదా నా తోడు నువ్వే కదా.. నీకు నాకు ఉందో కథ ఆ పేరు ప్రేమే కదా' అంటూ సింపుల్ పదాలతోనే సాహిత్యం సాగింది. ఈ పాటను పాడినవారు అనురాగ్ కులకర్ణి.  పాట మరీ రెగ్యులర్ స్టైల్ లోకాకుండా ఒక డిఫరెంట్ ఇన్ స్ట్రుమెంటేషన్ లో ట్రై చేశాడు మిక్కీ. సాంగ్ సూపర్ అని చెప్పలేం కానీ వినేకొద్ది నచ్చే తరహాలో ఉంది. లిరికల్ సాంగ్ వీడియో లో చూపించిన విజువల్స్ కూడా పాటను ఎలివేట్ చేసేలా ఉన్నాయి.
మిక్కీ జే. మేయర్ ఈమధ్య 'వాల్మీకి' మ్యూజిక్ తో ఒక్కసారిగా అందరినీ షాక్ చేశాడు.  ఈ సినిమా తన స్టైల్ కు సూటయ్యే లవ్ స్టొరీ కాబట్టి ఫీల్ గుడ్ సాంగ్స్ ఆశించవచ్చు.  ఫస్ట్ సాంగ్ అయితే బాగుంది. మరి మిగతా సాంగ్స్ ఎలా ఉంటాయనేది వేచి చూడాలి. 'ఇద్దరిలోకం ఒకటే' కి ఈ పాట పాజిటివ్ స్టార్ట్ అని చెప్పొచ్చు.
కానీ ఈ మధ్య సక్సెస్ లేక ఇబ్బంది  పడుతున్న రాజ్ తరుణ్ కి ఈ సినిమా అయినా బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి .మొన్న ఆ మధ్య ఆక్సిడెంట్ కేసు లో కొంచెం హుంగామ జరిగింది ఆ విషయం ఇపుడు ఇపుడే ముగిసింది ఇక రాజ్ తరుణ్ కి సక్సెస్ రావాలి అని కోరుకుంటున్నాము. 


మరింత సమాచారం తెలుసుకోండి: