ఆరేళ్ళ క్రితం టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ల లిస్టులో శ్రీను వైట్ల ఉండేవారు. పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా ఆయనతో సినిమా చేసేందుకు రెడీగా ఉండేవారు.  అయితే 2014 లో విడుదలైన 'ఆగడు' ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చింది.  ఎంత పెద్ద దర్శకుడికైనా ఫ్లాపులు సహజమే అన్నట్టుగా ఆ తర్వాత కూడా శ్రీను వైట్లకు మంచి ఆఫర్లే వచ్చాయి. 

        అందులో 'బ్రూస్ లీ' ఒకటి. రామ్ చరణ్ హీరోగా నటించిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత శ్రీను వైట్ల నెక్స్ట్ ప్రాజెక్ట్ సెట్ చేసుకునేందుకు కష్టపడాల్సి వచ్చింది.   ఫైనల్ గా వరుణ్ తేజ్ తో 'మిస్టర్' సెట్ అయింది.  ఆ సినిమా ఫలితంలో కూడా మార్పు లేదు.ఇక శ్రీను వైట్ల లాస్ట్ సినిమా 'అమర్ అక్బర్ ఆంటోని' గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఆ సినిమాతో శ్రీను వైట్లతో సినిమా అంటే హీరోలు భయపడే పరిస్థితి వచ్చింది.

         ఈ ఏడాది జనవరిలో శ్రీను వైట్ల-అఖిల్ కాంబినేషన్  సినిమా గురించి కొన్ని వార్తలు వచ్చాయి కానీ అవి గాసిప్స్ గానే మిగిలిపోయాయి. ఇక ఇద్దరు హీరోలతో శ్రీను వైట్ల ఒక కామెడీ ఎంటర్టైనర్ కథ రెడీ చేస్తున్నారని ఏప్రిల్ లో మరో వార్త వినిపించింది కానీ శ్రీను వైట్ల రీసెంట్ ట్రాక్ రికార్డ్ చూసి ఇద్దరు హీరోలు డేట్స్ ఇవ్వడం దాదాపు అసాధ్యమేనని అప్పుడే కామెంట్లు వినిపించాయి.

          శ్రీను వైట్లకు దాదాపు హీరోలందరూ మొహం చాటేస్తున్నారని సమాచారం.  మీడియమ్ రేంజ్ హీరోలే కాదు..బాద్షా సినిమా లో రివెంజ్ నాగేశ్వర్రావు డైలాగ్ లా ఫాన్స్ అతని మీద రీవెంజ్ తీర్చుకుంటున్నారా ???


మరింత సమాచారం తెలుసుకోండి: