మిక్కీ జే మేయర్ అనగానే  సుమధురమయిన పాటలకు పెట్టింది పేరు.తాను చేసే ఏ  సినిమా అయినా, తన పాటలకంటూ  ఒక్క  కచ్చితమయిన ముద్ర  ఉంటుంది.మిక్కీ జే మేయర్ అంటేనే  మంచి పాటలకు కేరాఫ్ అడ్డాగా పేర్కొంటారు చాల మంది సినీ ప్రముఖులు.ఆయన చాలా సెలెక్టెడ్ గా  సినిమాలు చేసినా,తన పాటలో ఆయన సత్తా చాటుతుంటారు. తాజాగా ఇప్పుడు నిర్మాత దిల్ రాజు బ్యానర్ పై శిరీష్ నిర్మించే ఇద్దరిదీ ఒకటే లోకం సినిమాకు లేటెస్ట్ గా పాటలు అందిస్తున్నారు  మిక్కీ జే మేయర్.

కొంచెం గ్యాప్  తరువాత మళ్ళి రాజ్ తరుణ్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలోని  ఓ పాట బయటకు వచ్చింది ఈమధ్య. నువ్వే.. నువ్వే.. నువ్వే.. నా తోడు నీవే కదా? నీకు నాకు వుందో కథ, ఆ పేరు ప్రేమే కదా? అంటూ  వచ్చిన ఈ పాటకి  బాలాజీ లిరిక్స్ ఇవ్వగా ,అనురాగ్ కులకర్ణి వాటిని ఆలపించారు. ఒక్కసారి వినగానే  మనసుకు పట్టేసేంత క్యాచీగా లేకపోయినా, వినగానే బాగుందిగా అనిపించేలా ఒకమాదిరిగా  వుంది ట్యూన్ అంటున్నారు నెటిజన్లు.

మిక్కీజే మేయర్ రెగ్యులర్  ఇచ్చే బాక్గ్రౌండ్ మ్యూజిక్  కాకుండా కాస్త కొత్తగా  ప్రయత్నించినట్లు తెలుస్తుంది. పాట వినగానే మిక్కీజే మేయర్ కదా మ్యూజిక్ అనేలా కాకుండా,ఎవరు  ఈ మ్యూజిక్  ఇచ్చారు అని చర్చించేలా వుంది అని అంటున్నారు విన్నవారంతా.

మొత్తంమీద మళ్ళి  రాజ్ తరుణ్ ను మంచి మూవీతో ,ప్లాట్ ఫారమ్ మీదకు పక్కాగా తీసుకువచ్చేలా ప్రణాళికవేసినట్టు ఉన్నారు దర్శకులు  దిల్ రాజు.మిక్కీజే మేయర్  మ్యూజిక్ మరియు రాజ్ తరుణ్ హీరోగా,డైరెక్టర్ దిల్ రాజు కాంబినేషన్లో వచ్చే ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే  మరి కొంతకాలం వేచి చూడాల్సిందే  మనం .


మరింత సమాచారం తెలుసుకోండి: