'కొత్త బంగారు లోకం' సినిమాతో యూత్ ని బాగా ఆకట్టుకున్న హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్. ఈ ఒక్క సినిమాతోనే తెలుగులో శ్వేతాబసుకు లక్షల్లో అభిమానులు పుట్టుకొచ్చారు. టాలీవుడ్ మొత్తం తన గురించి ఆలోచించేలా ఈ సినిమాతో క్రియోట్ చేసుకుంది. అయితే ఆ తర్వాత తను చేసిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అవడంతో వచ్చిన పేరు వచ్చినట్టే పోగొట్టుకోవడం తో పాటే కెరీర్ రేస్ లోను వెనకపడిపోయింది. అప్పటికి తన కెరీర్ డామేజ్ అవకుండా ఉండటానికి కొన్ని ఐటెం సాంగ్స్ కూడా చేసింది. అయినా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. దానికి తోడు సరిగ్గా ఆ సమయంలోనే శ్వేతాబసు ప్రసాద్ వ్యభిచారం కేసులో ఇరుక్కుంది. తర్వాత కోర్టు కేసులతో ఉక్కిరి బిక్కిరైన శ్వేత కెరీర్ కి ఫుల్ స్టాప్ పడిపోయింది.  

ఈ కేసులో ఆమె పోలీసులకి దొరికిన తర్వాత మన తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా శ్వేతాబసు ని అసహ్యించుకుంటు దూరం పెట్టారు. నోటికొచ్చినట్టు మాట్లాడారు. అంతేకాదు ఆమెను పూర్తిగా ఇండస్ట్రీకి దూరం పెట్టి సినిమా అవకాశాలు ఇవ్వలేదు. దీంతో ఆమె అభిమానులు కొందరు తెలుగు సినీ పెద్దలని దూషిస్తూ సన్నీ లియోన్ లాంటి పోర్న్ స్టార్ కి సినిమాలలో ఛాన్స్ ఇస్తున్నారని - శ్వేతాబసు చేసిన ఈ చిన్న పొరపాటుకి ఎందుకు చులకనగా, చీప్ గా చూస్తున్నారంటు ప్రశ్నలతో దాడి చేశారు. కానీ వాటిని ఎవరూ పట్టించుకోకపోగా తన మీద కాస్త కూడా జాలి చూపించలేదు.

అయినా అన్నిటిని తట్టుకొని అవమానాలను భరించి నెమ్మదిగా నిలదొక్కుకొని శ్వేతా కొన్ని హిందీ సినిమాలలో నటించి మళ్ళీ తన కెరీర్ నిలబెట్టుకుంది. కానీ హిట్స్ మాత్రం దక్కించుకోలేపోయింది. దాంతో ఇంక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని కొంతకాలం క్రితం పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. ఇప్పుడు ఆమె సినిమా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. అయితే ఆ మధ్య ఆమె రీ ఎంట్రీ ఇస్తూ చేసిన 'ది తాష్కెంట్ ఫైల్స్' అనే సినిమా ఇప్పుడు ఆస్కార్ కి నామినేట్ అవ్వడంతో శ్వేతాబసు ప్రసాద్ మళ్ళీ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. ఏదేమైనా టాలెంట్ ఉంది కాబట్టే ఆమె నటించిన సినిమా ఆస్కార్ కి నామినేట్ అయిందని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: