అల్లు అరవింద్, దిల్ రాజు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అన్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు వీళ్ళిద్దరూ బాలీవుడ్ లో కూడా నిర్మాతలుగా సక్సస్ అవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అల్లు అరవింద్ ఇప్పటికే బాలీవుడ్ లో 'గజిని' వంటి సినిమాలను ప్రొడ్యూస్ చేశారు. ఇప్పటికే అరవింద్ కి బాలీవుడ్ నిర్మాతగా మంచి నేం ఫేం ఉన్నాయి. అంతేకాదు బాలీవుడ్ లో ఆయనకి ఒక బ్రాండ్ కూడా ఉందన్న విషయం తెలిసిందే. కానీ దిల్ రాజు మాత్రం ఇప్పుడే బాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. నాని తెలుగులో నటించిన 'జెర్సీ' సినిమాని ఈ స్టార్ ప్రొడ్యూసర్స్ ఇద్దరూ హిందీలో రీమేక్ చేయబోతున్నారు. ఇక రీసెంట్‌గా తెలుగు సినిమా 'అర్జున్ రెడ్డి' ని 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టాడు. ఆ క్రేజ్ తోనే షాహిద్ కపూర్ ఇప్పుడు హిందీ 'జెర్సీ' లో హీరోగా చేయబోతున్నాడని లేటెస్ట్ న్యూస్.

అయితే ఈ సినిమాకి షాహిద్ అడిగిన రెమ్యునరేషన్ విని మన ప్రొడ్యూసర్స్ షాక్ అయ్యారని తెలుస్తోంది. షాహిద్ దాదాపుగా 50కోట్లు పారితోషకం అడిగాడట. దీంతో ఆలోచనలో పడ్డ నిర్మాతలు అతనితో మాట్లాడి ఒక డీల్ కి వచ్చినట్టు తాజా సమాచారం. షాహిద్ కి కొంత రెమ్యునరేషన్ తో పాటు సినిమాపై వచ్చిన ప్రాఫిట్స్ లో 30% ఇస్తామని ప్రొడ్యూసర్స్ చెప్పడంతో షాహిద్ ఈ డీల్ కి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. నిర్మాతలు-హీరో మధ్య ఈ డీల్ సెట్ కావడంతో త్వరలోనే ఈ సినిమా షూటింగ్ సెట్స్ మీదకు వెళ్ళబోతోంది. 

దిల్ రాజు ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలను బాలీవుడ్ లో ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో ఆయన నిర్మించిన 'ఎఫ్ 2' సినిమాను హిందీలో బోనీ కపూర్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా నిర్మాణంలో బోనీతో పాటు దిల్ రాజు కూడా పార్ట్‌నర్ అవబోతున్నారు. ఇక అల్లు అరవింద్ కూడా దంగల్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న 'రామాయణం' సినిమాకు కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక మన టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ నిర్మించే సినిమాలు హిట్ అయ్యి బాలీవుడ్ లో మన తెలుగు నిర్మాతలకు  స్టార్ హోదా రావాలని తెలుగు సినీ అభిమానులు కోరుకుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: