కొరటాల శివ  - మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమాలో మెగాస్టార్ రోల్ ఇదేనని ఇండస్ట్రీలో ఓ న్యూస్ హల్ చల్ చేస్తోంది.   రాష్ట్రంలోని దేవాలయాలు మరియు అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన ఎండోమెంట్స్ విభాగానికి చెందిన  ప్రభుత్వ ఉద్యోగిగా మెగాస్టార్ ఈ సినిమాలో కనిపిస్తారని తెలుస్తోంది. ఇక  ఈ సినిమా  స్క్రిప్టు ఫైనల్‌ వెర్షన్‌ జరుగుతోంది. ఇక ఈ సినిమాకి  టెక్నీషియన్లు దాదాపుగా ఖరారయ్యారు. ప్రస్తుతం నటీనటులను ఎంపిక చేస్తోన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి కొర‌టాల త‌న సెంటిమెంట్‌ ను  బ్రేక్ చేస్తున్నాడని..   కొర‌టాల మొదటి సినిమా  'మిర్చి' నుండి..  ఆ తరువాత కొరటాల తీసిన   శ్రీమంతుడు, జ‌న‌తాగ్యారేజ్‌, మ‌హ‌ర్షి చిత్రాలకు మ్యూజిక్ అందించిన  దేవిశ్రీ ప్ర‌సాద్ ను కాదని,   సైరాకి సంగీతం అందించిన అమిత్ త్రివేదిని మెగాస్టార్ తో చేయబోయే సినిమాకి  సంగీత దర్శకుడిగా పెట్టుకున్నాడని ఇటీవలే  వార్తలు వచ్చాయి.  కానీ ఈ సినిమాకి దేవిశ్రీ ప్ర‌సాదే  సంగీత దర్శకుడిగా పని చేయనున్నాడు.  

 ఇక ఈ చిత్రంలో చిరు ద్విపాత్రాభినయం చేస్తున్నారట.  ఈ సినిమాలో మెగాస్టార్  సరసన కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా తీసుకోనున్నారని  సమాచారం. కొరటాల శివ, మెగాస్టార్ కోసం ఓ  మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న  స్క్రిప్ట్ ను  తయారు చేసారట.   ఇక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా   సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో  మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా  మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన   ‘సైరా నరసింహా రెడ్డి’  చిత్రం అద్భుతమైన  పాజిటివ్‌ టాక్‌ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను రాబడుతొంది. దాంతో  మెగా అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు.  

కాగా బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్  మెగాస్టార్ చిరంజీవి కోసం సైరా చిత్రంలో నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా కనిపించారు.  అలాగే  ఈ సినిమాలో  సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క  వంటి స్టార్ లు కూడా  నటించారు.   అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా  సినిమా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.  ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించింది. సినిమా రిపోర్ట్స్ ను బట్టి బ్లాక్ బస్టర్ అంటున్నారు.      


మరింత సమాచారం తెలుసుకోండి: