టాలీవుడ్ సినిమా పరిశ్రమకు 2006లో వివి వినాయక్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన లక్ష్మి అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నయనతార. అలానే తొలి సినిమాతోనే మంచి హిట్ ని ఆమె అందుకుంది. అయితే ఆ తరువాత నాగార్జునతో కలిసి ఆమె నటించిన బాస్ సినిమా పెద్ద పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక ఆ తరువాత ఏడాది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన యోగి, అలానే మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన దుబాయ్ శ్రీను సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి విజయాలు అందుకుంది. ఇక అనంతరం మరొకసారి విక్టరీ వెంకటేష్ తో కలిసి ఆమె జతకట్టిన తులసి సినిమా కూడా మంచి సక్సెస్ సాధించి, టాలీవుడ్ లో నయనతారకు స్టార్ హీరోయిన్ స్టేటస్ ని తెచ్చిపెట్టింది. 

అయితే ఆ తరువాత ఆమె నటించిన కథానాయకుడు, ఆంజనేయులు, సెల్యూట్ సినిమాలు పెద్ద ఫ్లాప్స్ గా నిలిచాయి. ఆపై ఎన్టీఆర్ తో కలసి ఆమె నటించిన అదుర్స్, మరొక్కసారి వెంకటేష్ తో కలిసి నటించిన బాడీ గార్డ్, అలానే నందమూరి బాలకృష్ణతో తొలిసారి జతకట్టిన సింహా సినిమాలు నయనతారకు సూపర్ హిట్స్ ని అందించి ఇక్కడ ఆమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. అయితే మొదటి నుండి నిర్మాత, దర్శకుల మాటలకు ఎంతో విలువనిచ్చే నయనతార, ఇటీవల ఆమె నటిస్తున్న సినిమాల ప్రమోషన్స్ కు రాకపోవడం పై పలువురు నిర్మాతలు బహిరంగంగానే ఆమె పై ఆరోపణలు చేస్తున్నారట. అంతేకాక విక్టరీ వెంకటేష్ తో కలిసి ఆమె ఇటీవల నటించిన బాబు బంగారం సినిమా షూటింగ్ సమయంలో వెంకటేష్ గారు షూటింగ్ స్పాట్ కు వచ్చిన సమయంలో, 

ఆయనకు విలువనివ్వకుండా నయనతార గారు కుర్చీలో కూర్చోవడం తనకు నచ్చలేదని దర్శకుడు మారుతీ వెల్లడించడం జరిగింది. అది మాత్రమే కాక, మొన్న గాంధీ జయంతి నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ సైరా నరసింహారెడ్డి సినిమా ప్రమోషన్స్ కు కూడా పూర్తిగా డుమ్మా కొట్టిన నయన్ ప్రవర్తన ఇక్కడి నిర్మాత, దర్శకులకు అస్సలు నచ్చడం లేదని టాక్. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే, రాబోయే రోజుల్లో టాలీవుడ్ లో ఆమెకు అవకాశాలు రావడం కొంత కష్టమే అంటున్నారు కొందరు విశ్లేషకులు. మరి నయన్ విషయమై రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: