బిగ్ బాస్ ఫైనల్ కి ఇంకా కొద్ది సమయమే ఉంది. ఇలాంటి టైమ్ లో టైటిల్ విన్నర్ ఎవరనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో ఎవరి ప్లాన్స్ వారికి ఉన్నాయి. అయితే బిగ్ బాస్ కూడా టైటిల్ విన్నర్ విషయంలో తన ప్లాన్ లో ఉన్నాడట. ఇప్పటి వరకు హౌస్ మెంబర్స్ అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఫైనల్ కి దగ్గర అవుతున్న కంటెస్టెంట్ల పద్దతిలో మార్పు రాకపోవడంతో బిగ్ బాస్ తానే గేమ్ స్టార్ట్ చేశాడు.


కంటెస్టెంట్ల మధ్య అగ్గి రాజేసి వారిలోని గేమర్ ని బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో బిగ్ బాస్ సఫలీకృతం అయ్యాడని తెలుస్తుంది. బిగ్ బాస్ ప్లాన్ ప్రకారం హౌస్ లో బెస్ట్ ఫైవ్ మెంబర్స్ ని మాత్రమే ఫైనల్ కి తీసుకోవాలని అనుకుంటున్నాడు. అందుకే నామినేషన్ టాస్క్ లో అందరినీ నామినేట్ చేశాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వితికా, శివజ్యోతి, ఆలీ లలో  ఇద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.


ఒకవేళ శివజ్యోతి, ఆలీ ఎలిమినేట్ అయితే గనక వితికా, వరుణ్, రాహుల్ ల మధ్య ఓట్ల చీలిక జరుగుతుంది. అప్పుడు మిగతా సభ్యులైన బాబా భాస్కర్, శ్రీముఖిలు లాభపడతారు. అయితే బాబా భాస్కర్, శ్రీముఖిలలో బాబా భాస్కర్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ తెలుగువాడు కాదు అనే ట్యాగ్ ఉండడం వల్ల అతనికి మైనస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అదీగాక శ్రీముఖికి మొదటి నుండి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది.


బుల్లితెర మీద యాంకర్ గా చేయడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ ఓట్లు బాగా కలిసొస్తాయి. ఇక ఇంకో విషయం ఏంటంటే, ఇప్పటి వరకు అమ్మాయి బిగ్ బాస్ విన్నర్ అవలేదు. దానివల్ల ఈ సారైనా అమ్మాయి బిగ్ బాస్ విన్నర్ కావాలని కోరుకుంటున్నారు. వీటన్నింటి వల్ల శ్రీముఖి బిగ్ బాస్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని విశ్లేషిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: