మెగాస్టార్ చిరంజీవి సినీ కెరియర్ లోనే మొట్టమొదటి చారిత్రాత్మక సినిమా గా తెరకెక్కిన సినిమా సైరా నరసింహారెడ్డి. సినిమాలో మొదటిసారి చిరంజీవి ఒక స్వతంత్ర సమర యోధుడు పాత్రలో నటించారు. నరసింహా రెడ్డి పాత్రలో నటించిన చిరంజీవి తన నటనతో  అందరినీ మెప్పించి ప్రశంసలు అందుకున్నారు. అయితే ఈ సినిమా మిగతా భాషల్లో సరైన హిట్టు అందుకు లేకపోయినప్పటికీ టాలీవుడ్ లో  మాత్రం మంచి విజయాన్ని అందుకుని మంచి వసూళ్లు రాబట్టింది సైరా నరసింహారెడ్డి సినిమా. అయితే సైరా విజయంతో దూకుడు మీదున్న చిరంజీవి మరో సినిమాని సైన్  చేశారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తో చిరంజీవి సినిమా చేస్తున్నాడు. 

 

 

 

 

 అయితే ఈ సినిమా షూటింగ్ వచ్చేనెల ప్రారంభించబోతున్నారు. ఇదిలా ఉంటే మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలకు పెట్టింది పేరుగా చెప్పుకునే డైరెక్టర్ కొరటాల శివ. ఆయన ఏ సినిమా తీసిన ఆ సినిమా లో ప్రజలకు ఏదో ఒక మెసేజ్ ఇస్తుంటాడు. అయితే తాజాగా మరో మెసేజ్ ఓరియంటడ్ సినిమానే చిరంజీవి కోసం తయారు  చేశారట కొరటాల శివ. డిఫరెంట్ బ్యాక్ గ్రౌండ్ లో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు సినీ వర్గాలు చెబుతున్నాయి. దేవాలయాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించబోతున్నారట  కొరటాల శివ. దేవాలయాలను నిర్లక్ష్యం చేయడం వల్ల సమాజంలో ఎలాంటి చెడు ప్రభావం పడుతుంది అనే దానిపై ఈ సినిమా కాన్సెప్ట్ ఉండబోతుందని సమాచారం. 

 

 

 

 

 ఈ సినిమాలో దేవాదాయ శాఖ లో  పనిచేసే ఉద్యోగి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి కనిపించబోతున్నాడట. ఇక దేవాదాయశాఖ భూములను అన్యాక్రాంతం చేస్తున్నవారిపై ఉక్కుపాదం మోపి... దేవాదాయశాఖ ఆస్తులను హీరో ఎలా కాపాడుతాడు అనే కాన్సెప్టుతో ఈ సినిమా తెరకెక్కించబోతున్నారు అని సినీ వర్గాల్లో  చర్చలు నడుస్తున్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో  నటి విజయశాంతి పేరు పరిశీలిస్తున్నారట. మరోవైపు ఓ  యంగ్ హీరోయిన్  ఈ సినిమాలో చిరంజీవి సరసన నటించబోతున్నట్లు సమాచారం. సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరున్న  కొరటాల శివ ఈ సినిమాతో చిరంజీవి కి ఎలాంటి సక్సెస్ ఇస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: