బిగ్ బాస్ మూడో సీజన్ ఇంకో మూడు వారాలు మాత్రమే ఉంది..ఈ షో మొదలయ్యిందా.. అప్పుడే పూర్తయిందా అనే విషయాన్నీ కూడ ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదని అర్తమవుతుంది. 12 వారం కు గాను ఈ షో లో మహేష్ విట్టా ఇంటినుండి బయటకు వచ్చాడు. అయితే, మొన్నటి వరకు నత్త నడకగా సాగిన ఈ షో ఈ మధ్య ప్రేక్షకుల మనసును దోచేస్తుంది. 


ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ పక్రియ పూర్తి కావొస్తుంది.. అయితే, షో చుసిన వారందరికీ బొమ్మ చూపిస్తున్నారు. అసలు ఎందుకు గొడవ పడుతున్నారు. ఇది షో మాత్రం కదా.. దానికే చీరలు పైకెత్తి కొట్టుకోవాలా అంటూ అందరు ట్రోల్స్ వేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఈ షో లో మొన్న వారం మొదట్లో టాపర్ ఆఫ్ డ్ షో టాస్క్ ను బిగ్ బాస్ ఇచ్చారు. ఆ టాస్క్ కాస్త బిందెల దగ్గర గొడవగా మారింది. 


ముందుగా రాహుల్, శ్రీముఖి మాత్రం నువ్వెంత,నూ బతుకెంత అని మాటలతో దూషించుకున్నారు. మాటలు మర్యాదగా మాట్లాడు అంటూ పోట్ల గిత్తలులాగా ఒకరిపై మరొకరు మాటల యుద్ధం చేసుకున్నారు.గలీజ్ మాటలతో ఒకా వార్ ని తీసుకొచ్చారు. సఖ్యంగా ఉన్న వీరే అసభ్యపదజాలంతో అనుకున్న కూడా కొద్దిసెప్పయ్యాక ఈ గొడవ సర్దుమణిగింది. 


ఇకపోతే ఈ షో లో మరో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. అదేంటంటే.. వితిక, శివజ్యోతి నువ్వా నేనా అంటూ మూడో నంబర్ లో నిలుచొని నేనేంటే నేను అని గొడవపడటం. ఆడావాళ్ల మధ్యలో వరుణ్ ఎంటర్ అవ్వడంతో ఈ గొడవా మరింత ఎక్కువ అయింది. భార్యను వెనకేసుకొని రావడం కరెక్ట్ కాదని ప్రేక్షకులు అంటున్నారు. అటు బిగ్ బాస్ ఈ వారం అందరిని ఎలిమినేషన్‌కు నామినేట్ చేశాడు. కాగా, ఎప్పటినుంచో ఇంటి నుంచి వితికను బయటికి పంపాలని వెయిట్ చేస్తున్న నెటిజన్లకు దీంతో సరైన అవకాశం దొరికింది. ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉండవచ్చిన అని అభిప్రాయపడుతున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: