అజ్ఞాతవాసి తర్వాత ఫుల్ టైం పాలిటిక్స్ లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్ మళ్లీ ముఖానికి రంగేసుకునే అవకాశం లేదని పవర్ స్టార్ ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు. కాని పవన్ తన మనసు మార్చుకున్నాడు. త్వరలోనే పవన్ సినిమా ఒకటి స్టార్ట్ అవబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పవన్ కు ఇద్దరు ముగ్గురు నిర్మాతలు అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు.


పవన్ కళ్యాణ్ తో మైత్రి మూవీస్ ఓ సినిమా ప్లాన్ చేస్తుంది. ఇక ఈ సినిమాకు దర్శకుడిగా క్రిష్ ను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. పవన్ కోసం క్రిష్ ఓ అద్భుతమైన కథ రాశాడట. పవన్ కళ్యాణ్ కూడా లైన్ నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పినట్టు టాక్. క్రిష్ డైరక్షన్ లో పవన్ కళ్యాణ్ కచ్చితంగా ఇది పవర్ స్టార్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే వార్త అని చెప్పొచ్చు.


ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత క్రిష్ కొద్దిపాటి గ్యాప్ తో మళ్లీ సినిమా చేయాలని చూస్తున్నాడు. బయోపిక్ పై భారీ అంచనాలు ఉన్నా సరే ఆ అంచనాలను అందుకోలేదు. అయితే దర్శకుడిగా క్రిష్ ఎప్పుడు ఫెయిల్ అవలేదు కాని ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో అతనికి బ్యాడ్ నేం వచ్చింది.     


ఇదిలాఉంటే పవన్ తో గబ్బర్ సింగ్ సినిమా తీసి హిట్ అందుకున్న హరీష్ శంకర్ కూడా ఓ సినిమా చేస్తాడని తెలుస్తుంది. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ అని అంటున్నారు. మరి రీమేక్ స్పెషలిస్ట్ అయిన హరీష్ శంకర్ పవర్ స్టార్ తో ఆ హిట్ మేనియా కొనసాగిస్తాడేమో చూడాలి. మెగా ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నా మెగాస్టార్ రేంజ్ మెగాస్టార్ దే.. పవర్ స్టార్ రేంజ్ పవర్ స్టార్ దే అని చెప్పొచ్చు. మరి పవన్ వరుస సినిమాల్లో ఏది ముందు ఎనౌన్స్ చేస్తారో చూడాలి.   


మరింత సమాచారం తెలుసుకోండి: