అనసూయ ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు లేరు ఈ మధ్య మరీ ఫేమస్ అయిపోయిన అనసూయ తో ఇప్పుడు చేస్తున్న ఒక మూవీ చాలా కీలకం కానున్నది.టీవీ యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ ఆ తరవాత సినిమాల్లోనూ బిజీ అయ్యారు. ఓవైపు ‘జబర్దస్త్’ కామెడీ షోకు యాంకర్‌గా వ్యవహరిస్తూ మరోవైపు వరసపెట్టి సినిమాలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నిర్మిస్తోన్న ఈ సినిమాలో ‘పెళ్ళి చూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటించారు. నవంబర్ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

అయితే, త్వరలోనే ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టనున్నారు. ఈ ప్రమోషన్స్‌లో విజయ్ దేవరకొండ గురించి అనసూయ ఏం మాట్లాడుతుందో వినాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి కారణం ఉంది. గతంలో ‘అర్జున్ రెడ్డి’ సినిమా టైమ్‌లో అనసూయ కొన్ని విమర్శలు చేశారు.

ఆ సినిమాలో విజయ్ దేవరకొండ వాడిన ఒక పదం అసభ్యకరంగా, అభ్యంతరకరంగా ఉందని సోషల్ మీడియా ద్వారా అనసూయ విమర్శించారు. ఇలాంటి పదజాలంతో యూత్‌కు ఏం మెసేజ్ ఇస్తున్నారని ప్రశ్నించారు. ఆ సమయంలో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అనసూయను బాగా ట్రోల్ చేశారు.

కాబట్టి, అప్పుడు విజయ్ సినిమా గురించి విమర్శలు చేసిన అనసూయ.. ఇప్పుడు ఆయన నిర్మాతగా వ్యవహరించిన సినిమాలో నటించి ఆయన గురించి ఏం మాట్లాడుతుందో అనే ఆసక్తి అందరిలో ఏర్పడింది. చూద్దాం విజయ్ గురించి అనసూయ ఏం చెబుతారో..! ఈ సినిమాలో ‘మాయ’ ఫేమ్ అవంతికా మిశ్రా హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రం ద్వారా షమీర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.మొత్తానికి విజయ్ చెంతకు చేరక తప్పలేదు,ఇప్పుడు విజయ్ ప్రొడ్యూస్ చేస్తుండటం ఇంకా గొప్ప విషయం

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: