మోహన్ బాబు గారు రామోజీ గారు ఇలాంటి గొప్పవారి గురుంచి ఎంత చెప్పుకున్నా అది తక్కువే అలాంటిది ఇప్పుడు ఆ ఇద్దరు కలిస్తే అబ్బో ఆ అద్బుత ఘట్టాన్ని మాటల్లో చెప్పలేం.రామోజీ గ్రూపు సంస్థల అధినేత, ఈనాడు దినపత్రిక చీఫ్ ఎడిటర్ రామోజీరావును కలెక్షన్ కింగ్ మంచు మోహన్‌బాబు కలిశారు. రామోజీ ఫిలిం సిటీలో ఉన్న రామోజీరావు నివాసంలో ఆయన్ని మోహన్‌బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ విషయాన్ని మోహన్‌బాబు స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రామోజీతో తీసుకున్న ఫొటోలను కూడా మోహన్‌బాబు పొందుపరిచారు.

‘‘గొప్ప వ్యక్తుల్లో ఒకరైన శ్రీ రామోజీరావు గారితో అద్భుతమైన సమావేశం జరిగింది. సినిమాలు, విద్య, అలాగే రాజకీయాల గురించి కాసేపు ఆయనతో చర్చించాను. ఆయనొక ఎన్‌సైక్లోపీడియా. ఆయన నుంచి ఎంతో నేర్చుకోవచ్చు’’ అని మోహన్‌బాబు తన ట్వీట్ చేశారు.

కాగా, ఈ ట్వీట్‌తో మోహన్‌బాబు ఒక రూమర్‌కు చెక్ పెట్టినట్టయింది. అదేమిటో ఇప్పటికే అర్థమై ఉంటుంది. రామోజీరావు అనారోగ్యంతో బాధపడుతున్నారని, మృత్యువుతో పోరాడుతున్నారని, మెరుగైన వైద్యం కోసం విదేశాలకు వెళ్లడానికి కూడా ఆయన అంగీకరించడం లేదని ఆ మధ్య తెగ రూమర్లు వచ్చాయి. ఆయన బతికేది ఇంకొంత కాలమే అంటూ చాలా వెబ్‌సైట్లు, యూట్యూబ్ ఛానళ్లు రాశాయి.

కానీ, ఆయన ఆరోగ్యంగా ఉన్నట్టు మోహన్‌బాబు చేసిన ట్వీట్ చూస్తే అర్థమవుతోంది. ఎప్పటిలానే చిరునవ్వులు చిందుస్తూ మోహన్‌బాబును ఆయన ఆప్యాయంగా పలకరించారు. చక్కగా నిలబడి ఫొటోలు దిగారు.చూద్దాం ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఎన్ని అద్భుతాలు చెయ్యానున్నారో,ఏం చెయ్యానున్నారో అని కూడా అంత ఆశ్చర్యంతో వాపోతున్నారు.వీరి స్నేహం మరింత బలపడి తిరిగి మోహన్ బాబు మళ్ళీ ఫామ్ లో రావడానికి ఇదేమన్నా ఉపయోగ పడినుండనుందేమో వేచి చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: