వివాదాస్పద నటిగా పేరొందిన శ్రీరెడ్డి.. సామాజిక అంశాలపై కూడా తన వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ ఉదంతంలో ఇండస్ట్రీలో ఉన్న అనేక మంది చీకటిగుట్టును రట్టు చేసిన శ్రీరెడ్డి తాజాగా చాలా ఘాటుగా స్పందించారు.

ఇటీవల విశాఖలోకి కంచరపాలెంలో సెక్స్ రాకెట్‌ ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. కంచరపాలెం మురళీనగర్‌‌లోని ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తుండగా పోలీసులు దాడులు చేసి ముగ్గురు మహిళలు, ఇద్దరు యువతులు, ఓ ముద్దాయిని అరెస్ట్ చేశారు.

అయితే ఇష్యూపై స్పందిస్తూ వ్యభిచారం చేయడాన్ని సమాజ సేవగా అభివర్ణించింది శ్రీరెడ్డి. అంతేకాదు వేశ్యల్ని దేవతతో పోల్చుతూ తనదైన శైలిలో ఫేస్ బుక్‌లో పోస్ట్ వదిలింది. ‘వేశ్యలు అనేవాళ్లు లేకపోతే మీ చిన్నారి కూతుళ్లు భద్రత లేదు. వాళ్లని ఆ పని చేయనీయండి. కనీసం మగాళ్లు జంతువులుగా మారకుండా ఉంటారు. వేశ్యలంటే దేవతలు.ఎందుకంటే వాళ్లు ఈ రకంగా సామాజిక సేవ చేస్తున్నారు. ఒకవేళ ఈ వేశ్యలే లేకపోతే మీ ఫ్యామిలీ లేడీస్‌ని ఈ మగాళ్లు రేప్ చేస్తారు’ అంటూ హెచ్చరిస్తోంది శ్రీరెడ్డి.

ఇక మరో పోస్ట్‌లో వ్యభిచారం చేస్తున్న వేశ్య ఆనందంగానే ఉంది.. విటుడు ఆనందంగానే ఉంటున్నాడు మధ్యలో ఈ క్రైం ఏంటి అంటూ ప్రశ్నిస్తూ.. వ్యభిచారాన్ని సమర్ధిస్తూ వరుస పోస్ట్‌లు వదులుతోంది శ్రీరెడ్డి. అంతేకాదు.. వ్యభిచారం అడ్డుకోవడానికి వెళ్లిన పోలీసులకు చురకలేస్తోంది శ్రీరెడ్డి. ‘మీ గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి.. మీరెప్పుడూ తప్పు చేయలేదని. అలాంటి వారి వల్ల సమాజానికి లాభమే తప్ప నష్టం లేదు అంటూ చాలా కిష్టర్ క్లియర్ గా పేర్కొన్నారు.కాబట్టి ఇప్పుడు శ్రీ రెడ్డి చేస్తున్న కామెంట్స్ ఎంత దుమారం రేపనుందో అని విశ్వసనీయ వర్గాల సమాచారం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: