విజయ్ దేవర కొండ క్రేజ్ ఉన్న గొప్ప కాబొయ్యే మెగా హీరో ఇప్పుడు ఆ హీరో చేస్తున్న  అతి గొప్ప పని ప్రొడ్యూస్ చెయ్యడం. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి ‘నేను మాత్రమే చెప్తా’ అనే సినిమాను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ‘పెళ్ళి చూపులు’తో తనను హీరోగా పరిచయం చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్‌ను ఈ సినిమా ద్వారా విజయ్ దేవరకొండ హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అలాగే షమీర్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమా ద్వారా పరిచయమవుతున్నారు. అవంతికా మిశ్రా హీరోయిన్. అభినవ్ గోమటం, నవీన్ జార్జ్ థామస్, అనసూయ, వాణి భోజన్, పావని గంగిరెడ్డి కీలక పాత్రల్లో నటించారు.

ఈ సినిమాను నవంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా రేపు (అక్టోబర్ 16న) ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు. ఈ ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేయనున్నారు. రేపు సాయంత్రం 4.30 గంటలకు సోషల్ మీడియా ద్వారా ‘మీకు మాత్రమే చెప్తా’ ట్రైల

కాగా, ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. టైటిల్‌కు తగ్గట్టుగానే సినిమా ఫన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని టీజర్ చూస్తే తెలుస్తుంది. ముఖ్యంగా తరుణ్ భాస్కర్ నటన థియేటర్‌లో ప్రేక్షకుల కడుపులు చెక్కలు చేయడం ఖాయంలా కనిపిస్తోంది. ఇప్పటికే ‘ఫలక్‌నుమా దాస్’ సినిమాలో తన నటనకు మంచి మార్కులు కొట్టేసిన ఈ యువ దర్శకుడు ఈ చిత్రంలో తన నట విశ్వరూపాన్ని చూపించారట. టీజర్‌తో అందరినీ ఆకట్టుకున్న ఈ సినిమా రేపు రాబోయే ట్రైలర్‌తో అంచనాలను ఏమేర పెంచుతుందో చూడాలి.ఈ సినిమా హిట్ కొడితే ఇంక విజయ్ దేవరకొండ కి తిరుగులేదు.అతన్ని ఆపేవారు గాని,అడ్డుకునే వారు గాని ఎవ్వరు ఉండరు.దానికోసమే అనుకుంటా ప్రమోషన్స్ ని వేగ వంతం చేయనున్నారు విజయ్.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: