టీవీ యాంకర్ గా మెరుపులు మెరిపిస్తున్న అనసూయ.. వెండితెరపై కూడా అప్పుడప్పుడు జిగేలు మంటూ మెరుస్తున్నది. తాజాగా ఈ భామ విజయ దేవరకొండ నిర్మాతగా ‘మీకు మాత్రమే చెబుతా’ సినిమాలో నటించింది. ఈ సినిమా విషయమై అనసూయ ఏమి మాట్లాడుతుందనే దానిపై విజయ్ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు


‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్త పాత్ర చేసిన తరువాత అనసూయ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఒకవైపు యాంకర్ గా బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తూ బిజీగా మారింది అనసూయ. ప్రస్తుతం అనసూయ విజయ్ దేవరకొండ నిర్మిస్తోన్న ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. త్వరలోనే ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ గురించి అనసూయ ఏం మాట్లాడుతుందో వినాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

దీనికి కారణం ఒకపుడు అనసూయ విజయ్ దేవరకొండ పై చేసిన వ్యాఖ్యలు .. వివరాలలోకి వెళితే .గతంలో ‘అర్జున్ రెడ్డి’ సినిమా టైమ్‌లో విజయ్ దేవరకొండ ఆ సినిమాలో వాడిన ఒక పదం అసభ్యకరంగా, అభ్యంతరకరంగా ఉందని సోషల్ మీడియా వేదికగా అనసూయ విమర్శించారు. ఇలాంటి పదజాలంతో యూత్‌కు ఏం మెసేజ్ ఇస్తున్నారని ప్రశ్నించారు. ఈ విషయంలో విజయ్ ఫాన్స్ అనసూయను ట్రోల్ చేసారు. అప్పుడు విజయ్ సినిమా గురించి విమర్శలు చేసిన అనసూయ..

ప్రస్తుతం ఆయన నిర్మాతగా వ్యవహరించిన ‘మీకు మాత్రమే చెబుతా’ సినిమాలో  నటించింది.తాజాగా అనసూయ ఇప్పుడు విజయ్ గురించి ఏం మాట్లాడుతుందో అనే ఆసక్తి విజయ్ ఫ్యాన్స్‌తో పాటు సామాన్య ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో ‘పెళ్ళి చూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటించారు. నవంబర్ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: