చిత్రపరిశ్రమ అనేది ఓ రంగుల ప్రపంచం. అవకాశాలు ఉన్నంతవరకు బాగానే ఉంటుంది. వారికున్న ఇమేజ్, పాపులారిటీ వంటివి తగ్గిపోతే ఇక్కడ నెగ్గుకు రావడం చాల కష్టమే. ఈ రంగుల ప్రపంచంలో హీరోయిన్ల కంటే హీరోలకు చాలా కాలం లైఫ్ స్పాన్ ఉంటుంది అని అందరికి తెలుస్తుంది . అయితే వారి సరసన నటించే హీరోయిన్లకు మాత్రం ఐదరేళ్లకే  వారి కెరీర్ అయిపోతుంది అని బాగా అర్థం అవుతుంది ఇండస్ట్రీలో. 


ఈ కారణం వల్ల సపోర్టింగ్ రోల్స్ తో అలరించడానికి సిద్దాం అవ్వక  తప్పకుంది. ఐతే.. తెలుగు సినీ పరిశ్రమలో నటీమణులకు కొదవే లేదు ... ప్రస్తుతం హీరోయిన్ అంటే గ్లామర్ కు మారు పేరు అన్న విషయం అందరికి తెలిసిందే. అటు గ్లామర్ ఇటు నటన రెండింటినీ సమానంగా పరచుకుంటున్నారు నేటి తరం తారలు. ఇదే తరుణంలో తననుతాను సమన్వయ పరుచుకుంటూ టాలీవుడ్ లో బెస్ట్ ఆప్షన్‌గా మారింది పూజా హెగ్డే.


ఇప్పుడున్న మన తెలుగు యంగ్ హీరోలకు సరైన జోడీ అనిపించుకుంటూ డిమాండ్ అంతకంతకూ పెరిగి పోతుంది పూజా. ఎన్టీఆర్ తో 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాలో నటించిన తర్వాత వరుసగా  స్టార్ హీరోలతో నటించే అవకాశం వచ్చింది పూజాహెగ్డే అంటే నమ్మండి. మహేష్ బాబుతో 'మహర్షి' సినిమాలో, వరుణ్ తేజ్‌తో ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో నటించి అందం, అభినయం పరంగా నేటితరం హీరోయిన్లలో తానూ ప్రత్యేకం అని తన దిన స్టైల్ లో నిరూపించుకుంది. అంతేకాదు ఈ భామ అక్షయ్ కుమార్‌తో నటించిన ‘హౌస్‌ఫుల్ 4’ త్వరలో విడుదలకు కూడా సిద్ధంగా ఉంది.


ప్రస్తుతం ఈ భామ అల్లు అర్జున్..‘అల వైకుంఠపురములో’ సినిమాతో పాటు ప్రభాస్ కొత్త సినిమాలో నటిస్తుంది . మరోవైపు పూజాహెగ్డే  ఇప్పటి జనరేషన్ కోరుకునే విధంగా అందాల ప్రదర్శనకీ అడ్డు చెప్పకపోవడం, డేట్ల విషయంలో మరీ కచ్చితంగా ఉండకపోవడం ఆమెకు కలిసొస్తున్న అంశాలని తెలుపుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: