సినిమా హీరోలకి బయట ఉండే క్రేజే వేరు. సినిమాల్లో వాళ్ళు చేసే సాహసాలలో తమని తాము ఊహించుకుని ఆ హీరోమీద ఆరాధన భావంతో మెలిగి అభిమానులుగా తయారవుతారు. అయితే ఈ అభిమానులు హీరోలకి ఎంత బలమో అంతే బలహీనత కూడా. అభిమానులు చేసే పనులు కొన్ని కొన్ని సార్లు చికాకుని కలిగిస్తాయి. అభిమాన హీరో సినిమా మొదటి షో టికెట్ దొరకలేదని ఆత్మాహత్య యత్నానికి పాల్పడ్డవారిని చూశాం.


ఇలాంటి ఉదంతాలు చాలానే జరిగాయి. అయితే తాజాగా ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా తమ డిమాండ్స్ తీర్చడానికో, లేదా సినిమాల్లో చూపించినట్టు తనకు "ఐ  లవ్ యూ" చెప్పాలనో  సెల్ టవర్లకి ఎక్కి దూకేస్తానని బెదిరిస్తుంటారు. ఇలా చేసిన వాళ్లలో ఎవరూ కూడా దూకలేదని వాస్తవం. అయితే వీటికి భిన్నంగా ఒక యువతి చెట్టెక్కి కూర్చుని, సూపర్ స్టార్ మహేష్ బాబు ఇక్కడికి రావలంటూ, వచ్చేదాకా చెట్టు దిగనంటూ పట్టు బట్టింది.


ఆ యువతి డిమాండ్ కి అందరూ షాక్ అయ్యారు. ఈ సంఘటన విజయవాడ రెవెన్యూ కాలనీలోని అగ్రిగోల్డ్ కార్యాలయం దగ్గర్లో జరిగింది.మహేశ్ బాబు రావాలి.. మోడీతో మాట్లాడాలని..సీఎం జగన్ తన మొర ఆలకించాలంటూ ఆమె చేసిన రచ్చ స్థానికంగా సంచనలంగా మారింది. అయితే ఆ యువతి ఫోటోలు తీసిన వారి మీద చెట్టు కొమ్మలు విసిరేసింది.


కొద్దిసేపట్లో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను కిందకు దించే ప్రయత్నం చేశారు. కానీ.. అందుకు ఆమె సహకరించలేదు. ఆమె మానసికంగా సరిగా లేదని నిశ్చయించుకున్న పోలీసులు నిచ్చెన సాయంతో ఆమెని కిందకి దించారు. అనంతరం విచారించగా ఆమె కోల్ కతా నుంచి విజయవాడకు వచ్చిందని.. అక్కడ కొద్దిమంది చేతిలో మోసపోయినట్లు గుర్తించారు. ఆమె ఆరోగ్యం బాగు అయ్యేందుకు వీలుగా ఆసుపత్రికి తరలించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: