ఆరెక్స్ 100 సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటిన అజయ్ భూపతి ఆ సినిమా హిట్ తో సెన్సేషన్ సృష్టించాడు. కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ జంటగా నటించిన ఈ మూవీ తో ఆ ఇద్దరు సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. అజయ్ భూపతి తన సెకండ్ మూవీగా మహా సముద్రం చేయాలని చూస్తున్నాడు. 

 

రామ్, నితిన్,  నాగ చైతన్య చివరకు మాస్ మహారాజ్ రవితేజ కూడా ఈ ప్రాజెక్ట్ చేస్తాడని అనుకున్నారు. కాని వాళ్లెవరు సినిమా చేయట్లేదని తెలుస్తుంది. రవితేజ చివరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వడంతో అజయ్ భూపతి అప్ సెట్ అయ్యాడు. 

 

ఇదిలాఉంటే అజయ్ భూపతి ఈ మూవీని ఇప్పుడు యువ హీరోలతో చేయడానికి సిద్ధమయ్యాడట. మహా సముద్రం లో కార్తికేయ, విశ్వక్ సేన్ ఇద్దరితో కలిసి చేస్తాడని అంటున్నారు. ఇద్దరు యువ హీరోలు మంచి ఫామ్ లో ఉన్నారు. ఆరెక్స్ 100తో కార్తికేయ, ఫలక్ నుమా దాస్ తో విశ్వక్ సేన్ ఇద్దరు మంచి జోష్ లో ఉన్నారు. 

 

ఆరెక్స్ 100తో అదరగొట్టిన అజయ్ భూపతి త్వరలోనే మహా సముద్రం మూవీ కి సంబందించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేస్తారని తెలుస్తుంది. కార్తికేయ,  విశ్వక్ సేన్ ఇద్దరు ఇద్దరే మరి అజయ్ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: