'ఆర్ ఎక్స్ 100'..ఈ సినిమా టాలీవుడ్ లో సంచలనం అయింది. ముఖ్యంగా పాయల్ రాజ్ పుత్ కు హాట్ హీరోయిన్ గా విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇక హీరో కార్తికేయకు హీరోగా..  సినిమాలకు సైన్ చేశాడు. ఇక మొదటి సినిమాతోనే దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్ సక్సెస్ ను దక్కించుకున్న వర్మ శిష్యుడు అజయ్ భూపతి రెండవ సినిమాను ఇంకా బోల్డ్ గా తెరకెక్కించాలని సన్నాహాలు చేసుకున్నాడు. కానీ ఎందుకనో ఇంకా ఆ ప్రాజెక్ట్ మొదలు పెట్టలేదు. ఇక అజయ్ భూపతి రెండవ సినిమాగా 'మహాసముద్రం' అనే మల్టీస్టారర్ ను ఎంచుకున్నాడు. రవితేజతో పాటు పలువురు స్టార్స్ ను మహాసముద్రం కోసం అజయ్ సంప్రదించాడు. ఒకరు ఇద్దరు ఓకే అన్నట్లుగా అన్నారు. ఆ తర్వాత నెమ్మదిగా సారీ చెప్పారు. దాంతో మహాసముద్రం అలా అలా ఆలస్యం అవుతు వచ్చింది. దాదాపు రవితేజ తో సెట్స్ పైకి వెళ్ళబోతున్నాడనగా ఈ ప్రాజెక్ట్ పెండింగ్ లో పడింది. అక్కినేని నాగ చైతన్య, నితిన్..ఇలా యంగ్ హీరోలని ట్రై చేసి ఫేయిల్ అయ్యాడు అజయ్ భూపతి. 

అయితే ఎట్టకేలకు మహాసముద్రం సినిమాకోసం హీరోలు కన్‌ఫర్మ్ అయినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం. స్టార్ హీరోలతో మహాసముద్రం చేయాలనుకున్న అజయ్ భూపతి ఆశ నెరవేరడం లేదు. అందుకే కొత్త వారితోనే సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే తన మొదటి సినిమా హీరో కార్తికేయ తో పాటు విశ్వక్ సేన్ లను ఎంపిక చేసుకున్నాడట. వీరిద్దరు కూడా అజయ్ భూపతి చెప్పిన మహాసముద్రం స్క్రిప్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అతి త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతోందని లేటెస్ట్ న్యూస్. 

అజయ్ భూపతి తన మొదటి సినిమా ఆర్ ఎక్స్ 100 సినిమాని ఎలా బోల్డ్ గా.. మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించాడో 'మహాసముద్రం' సినిమాని కూడా అంతకంటే ఎక్కువ బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కించి మాస్ ఆడియన్స్ ను అలరించబోతున్నాడని తెలుస్తోంది. పెద్ద హీరోలతో అయితే కాస్త బోల్డ్ కంటెంట్ లేకుండా చూసుకునేవాడేమో దర్శకుడు. కాని కొత్త హీరోలు కనుక బోల్డ్ కంటెంట్ మొదటి సినిమా కంటే ఎక్కువగానే చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే రానుందట. 


మరింత సమాచారం తెలుసుకోండి: